డిఫెండింగ్ చాంపియన్ గా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలోకి అడుగుపెట్టిన టీమిండియా.. దాయాది పాకిస్తాన్ పై విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఇక నిన్నటి మ్యాచ్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 322 పరుగుల విజయలక్ష్యాన్ని వారికి నిర్ధేశించడంతో గెలుపుపై ధీమా వచ్చేసి.. తామే గెలుస్తామన్న అంచానాల్లోకి చేరుకుని.. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకుని.. లంకేయుల భాగస్వామ్యాలను విడదీయడంలో విఫలమైంది. దీనికి తోడు అన్ ఫీల్డ్ లో కూడా అతంగా రాణించలేకపోవడంతో చేజేతులా మ్యాచ్ ను జారవిడుచుకున్నారు.
దీంతో విరాట్ సేనకు టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి పరాభవం ఎదురైంది. ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సేనపై లంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లంకేయులను తేలికగా తీసుకుని విరాట్ సేన భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ దారుణ పరాజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. లంకేయుల ముందు తాము పెట్టిన విజయలక్ష్యం సాధారణమైనది కాదని.. దీంతో తాము గెలుస్తామన్న ధీమా పూర్తిగా వుండిందని అన్నారు. అయితే బౌలర్లను ఎంతగానో నమ్మానని, వారు మ్యాచ్ ను గెలిపిస్తారని కూడా భావించానని అన్నాడు.
విజయం తమ వైపు నుంచి జారి శ్రీలంక చేతుల్లోకి జారిపోయిందని, అయితే అసాధారణ లక్ష్యాన్ని కూడా అలవోకగా చేధించిన లంకేయులను ఆయన ప్రశంసించాడు. శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్ తో పాటు షాట్ సెలక్షన్ కూడా బాగుందని కితాబిచ్చాడు. పాక్పై రాణించిన బౌలర్లు లంకతో మాత్రం పూర్తిగా తేలిపోయారని విస్మయం వ్యక్తం చేశాడు. లంకేయులు బ్యాట్స్ మెన్లు చక్కని ప్రదర్శన చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నట్లు విరాట్ కోహ్లీ చెప్పాడు
మరీ ముఖ్యంగా తొలి వికెట్ కోల్పయిన తరువాత క్రీజులో వున్న.. కుషాల్ మెండిస్, ధనుష్క గుణతిలకలు తమ నుంచి మా నుంచి మ్యాచ్ ను దూరం చేశారని అభిప్రాయపడ్డాడు. మూడొందలకు పైచిలుకు స్కోరును కాపాడుకుంటామని భావించినా నిరాశే ఎదురైందని అవేదన వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ఆలోచనకు మరింత పదును పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అన్నాడు. భారత్ తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బి లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more