అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్ గా భారతీయుడైన శశాంక మనోహర్ కొనసాగుతున్నా.. బిసిసిఐ మాత్రం ఐసీసీ అధ్వర్యంలో నిర్వహించనున్న ఛాంఫియర్స్ ట్రాపీని బహిష్కరించాలన్న యోచనలో వుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మూడేళ్ల కిందట ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డుల సహకారంతో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అప్పటి ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రవేశ పెట్టిన ‘బిగ్-3’ ఆదాయ పంపిణీ విధానానికి ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్ ముగింపు పలకడమే. దీంతో బిగ్ 3 ద్వారా బిసిసిఐకి ఐసిసి నుంచి లభించే రాబడి కాస్తా హరించుకుపోవడంతో.. బిసిసిఐ ఈ మేరకు యోచిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించడం వల్ల బిసిసిఐకి కలిగే లాభమేంటి అంటారా..? భారత్ ఆడలేదంటే ఛాంపియన్స్ ట్రోఫీనే కళతప్పడం, ఆదాయంలో భారీగా గండిపడటం ఖాయం. మున్ముందు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తే ఐసీసీకి కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తవచ్చు. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని గ్రహించిన ఐసిసి భారత్ కు అదనంగా 650 కోట్ల రూపాయలను అందిస్తామని కూడా ప్రతిపాదన చేశారు. అయితే అందుకు బిసిసిఐ మాత్రం అంగీకారం చెప్పలేదు. మరి ఇప్పటికైనా ఐసిసి బిసిసిఐను దారికి తెచ్చుకునేలా చర్యలు తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్టును ప్రకటించాయి. అయితే ఐసిసి రగిల్చిన మంటతో మంచి కాకమీదున్న బిసిసిఐ మాత్రం ఇప్పటివరకు ఛాంపియన్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించలేదు. అయితే ఇందుకోసం ఐసిసి నిర్దేశించిన తుదిగడువు కూడా ముగిసిపోయింది. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం వేచిచూసే ధోరణినే అవలంబించనుంది. దీంతో బిసిసిఐ తమకు రానున్న అదాయ వనురులను రాబట్టుకునేందుకు ఐసీసీపై ఒత్తిడిని, ప్రయత్నాలను తీవ్రతరం చేసేందుకు ఎత్తుగడ వేసింది. బిసిసిఐ ఎత్తుగడలపై ఇప్పటివరకు ఐసీసీ పట్టించుకోలేదు. మరి టోర్నీకి జట్టునే పంపకపోవడం ద్వారా భారత్ తన నిరసనను తెలియజేస్తుందేమో చూడాలి.
ఈ టోర్నీకి ఇంతవరకూ భారత జట్టును బీసీసీఐ ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా లేకుంటే, ట్రోఫీ కళతప్పడంతో పాటు, ఐసీసీ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఆపై ఐసీసీ నిర్వహించే టోర్నీలకు బీసీసీఐ మద్దతు పలకకుంటే, క్రికెట్ ఆడే దేశాలన్నీ నష్టపోతాయి. ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి టోర్నీ బహిష్కరణపై ఎటువంటి అధికారిక సమాచారం రాకున్నా, తన మాటను నెగ్గించుకునే దిశగా అధికారులు ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more