నిర్వివాదంగా టీమిండియా అత్యద్బుత కెప్టెన్లలో అగ్రస్థానాన్ని అక్రమించి మేటి సారధిగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా తరువాత.. ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా తొలిసారిగా కెప్టెన్సీ పగ్గాలను లేకుండా బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఎన్నిమిది పర్యాయాల వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధ్య బాధ్యతలను నిర్వహించిన ధోని.. ఆ తరువాత గతేడాది పూణే జట్టు బాధ్యతలను తనపై వేసుకున్నాడు. కాగా ఈ సారి కెప్టెన్సీ పగ్గాలు లేకుండానే బరిలోకి దిగుతున్నాడు.
ఐపీఎల్ సీజీన్ ప్రారంభం నుంచి చెన్నై కెప్టెన్ గా వున్న ధోని గత రెండేళ్ల క్రితం ఆ జట్టు రద్దు కావడం, ధోనీ పుణె జట్టుకు వెళ్లడం తెలిసిందే. అయితే.. ముంబై ఇండియన్స్ జట్టుకు, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు మధ్య పుణె ఎంసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్లో ధోనీ కెప్టెన్గా కాకుండా కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ పదో సీజన్లో ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ పగ్గాలను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్కు అప్పగించాలని ఆర్పీఎస్ యాజమాన్యం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది.
ధోని తమతో సరిగా వ్యవహరించలేదని, ఆయన జట్టు విషయాల్లో కూడా తమతో ఎలాంటి చర్చలు నిర్వహించలేదని, అతని వ్యవహరతీరు కూడా తమతో కొంత భిన్నంగా వున్నందనే జట్టు ప్రయోజనాల కోసం తాము దోనిని కెప్టెన్సీ నుంచి తప్పించామని జట్టు యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. దీంతో సుమారు దశాబ్దం తర్వాత ఐపీఎల్లో కెప్టెన్సీ లేకుండా ధోనీ బరిలోకి దిగుతున్నాడు. జట్టు ప్రయోజనాల కోసమే స్మిత్కు పగ్గాలు అప్పగించినట్లు పుణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more