జార్ఖండ్ వేదికగా రాంచీ మైదానంలో ఈ నెల 16 నుంచి భారత్ అస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాపైనే అధిక ఒత్తిడి వుందని అస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ లో ఆసీస్ ఎటువంటి ఒత్తిడి లేకుండానే బరిలోకి దిగిందనే విషయం విరాట్ సేనకు తెలుసన్నాడు. ఈ క్రమంలో సిరీస్ ను గెలవాలన్న ఒత్తిడి తమకన్నా విరాట్ సేనపైనే విపరీతంగా ఉందన్నాడు.
'భారత్ తో సిరీస్ లో భాగంగా మేము దుబాయ్ లో అడుగుపెట్టినప్పుడు అపారమైన నమ్మకంతో ఉన్నాం. కానీ భారత్ కు వచ్చిన తరువాత సిరీస్ ను 4-0 తో కోల్పోతున్నామనే వార్తలు వచ్చాయి. ప్రతీ ఒక్కరు కూడా మాతో అదే చెబుతూ వచ్చారు. మా జట్టు భారత్ పై విజయం సాధించడం అంత ఈజీ కాదన్నారు. మా జట్టులో కీలక అటగాళ్లు లేకపోవడం.. జట్టు కొంత బలహీనంగా వుందని కూడా చెప్పారు.
మమ్మల్ని ఇంకా నేర్చుకునే జట్టుగానే అభివర్ణించారు. కాకపోతే ప్రపంచంలో ఎంత అత్యుత్తమ జట్టుపైనైనా గెలుపొందే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది. అదే తొలి టెస్టులో నిరూపించాం కూడా.రెండో టెస్టులో ఓడటం కొద్దిగా బాధించింది. మూడో టెస్టులో తిరిగి సత్తా చాటుతాం. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో భారత్ పైనే తీవ్ర ఒత్తిడి ఉంది.. మాపై ఎంతమాత్రం కాదు' అని లియాన్ తెలిపాడు. అయితే మూడో టెస్టుతో గెలుపు ఎవరిని వరిస్తుంది.. ఎవరిపైన ఒత్తిడి నెలకొందన్న విషయం త్వరలోనే తేలనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more