టీమిండియా మహిళల క్రికెట్ జట్టు ప్రత్యర్థుల పంబరేపుతుంది. అంచనాలు ఏమీ లేకుండా ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీ బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు వరుసగా ఐదో విజయాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇవాళ జరిగిన చిట్టచివరి లీగ్ మ్యాచ్ లో నేపాల్ పై అద్బుత విజయాన్ని అందుకున్నారు. నేపాల్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 99 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు. నేపాల్ను 21 పరుగులకే కూల్చేసిన భారత్ సంచలన విజయం సొంతం చేసుకుంది. ఇప్పటికే వరుస నాలుగు విజయాలతో ఫైనల్ కు చేరిన భారత్.. అదే జోరును నేటి నేపాల్తో మ్యాచ్లో కూడా కొనసాగించింది.
నేపాల్ స్కోరు బోర్డులో ఎక్సట్రా పరుగులకు వచ్చిన ఏడు పరుగులకే ఆ జట్టు అత్యధిక స్కోరు అంటే మన వాళ్లు ఏ రకంగా చెలరేగిపోయారు అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత సరితా మాగర్(6)దే నేపాల్ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. మొత్తం జట్టు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో నేపాల్ కు ఘోర ఓటమి తప్పలేదు. పూనమ్ పాండే మూడు వికెట్లు తీయగా, మేఘనా, అనుజా పటేల్లు తలో రెండు వికెట్లు సాధించారు. శిఖా పాండే, జోషి, ఏక్తా బిస్త్లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. వెల్లాస్వామి వనితా(21), అనుజ్ పటేల్(16), పార్వీన్(13), శిఖా పాండే(39 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(14 నాటౌట్)లు భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకున్నారు. కాగా లక్ష్యచేధనలో నేపాల్ జట్టు పూర్తిగా విఫలమైంది. మొత్తం జట్టులో ఆరు పరుగుల స్కోరు వ్యక్తిగత అదిక్యంగా నిలిచిందంటే నేపాల్ జట్టను టీమిండియా మహిళల జట్టు ఎలా మట్టికరింపించిందో అర్ధమైపోతుంది
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more