విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ విసిరిన 405 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఓపెనర్లు హమిద్(25), అలెస్టర్ కుక్(54)లను మాత్రమే ఇంగ్లండ్ కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం కోసం చివరి రోజు వరకూ వెళ్లింది. రెండో ఇన్నింగ్స్ లో గెలుపు కోసం శ్రమిస్తున్న ఇంగ్లాండ్.. అవకాశం కుదరని పక్షంలో మ్యాచ్ డ్రా కోసం యత్నిస్తున్న ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు పరమ జిడ్డు అటకు దిగారు, 38 ఓవర్లను అడిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ 50 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనంగా వుంది. ఈ మ్యాచ్ లో భారత్కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా, పటిష్టమైన ఇంగ్లండ్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
ఇంగ్లండ్ ఓపెనర్లు అలెస్టర్ కుక్, హమిద్లు అత్యంత నిలకడగా ఆడుతూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీ సుదీర్ఘంగా క్రీజ్లో పోరాటం చేసింది. అయితే 144 బంతులను ఎదుర్కొన్న హమిద్ చివరకు అశ్విన్ బౌలింగ్ లో వికెట్లు ముందు దొరికిపోయాడు. దాంతో వీరి 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, 171 బంతులను ఎదుర్కొన్న కుక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ రోజు ఆటలో చివరి ఓవర్ లో కుక్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో కుక్ ఎల్బీగా అవుటయ్యాడు.
ఆటలో మన బౌలర్లు 59.2 ఓవర్లు పాటు బౌలింగ్ చేసి కేవలం రెండు వికెట్లు సాధించడం ఇంగ్లండ్ పట్టుదలకు అద్దం పడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 50 ఓవర్లలో దాదాపు సగం ఇంగ్లండ్ జట్టును పెవిలియన్ కు పంపిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం వికెట్ల వేట కోసం తంటాలు పడుతోంది. ఇంకా సోమవారం చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. భారత్ విజయం సాధించాలంటే ఎనిమిది వికెట్లు అవసరం కాగా, అదే ఇంగ్లండ్ గెలుపు కోసం 318 పరుగులు చేయాల్సి ఉంది. ఈ టార్గెట్ ను సాధించేందుకు ఇంగ్లాండ్ చేతిలో ఎనమిది వికెట్లతో పాటు 90 ఓవర్లు మాత్రమే వున్నాయి
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more