విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో పర్యాటక జట్టు ఇంగ్లాండ్ పై.. టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. భారత్ విసిరిన 405 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఐదవ రోజు భారత బౌలర్ల ముందు మోకరిల్లింది. 87 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదవ రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పై విరాట్ సేన 200 పైచిలుకు పరుగులతో విజయాన్ని సాధించాడు.
మ్యాచ్ చివర్లో రెండు వికెట్లు.. అత్యంత నాటకీయంగా పడ్డాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బ్రాడ్ ఎల్బీడబ్ల్యుగా ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటిస్తే, రివ్యూకి వెళ్ళాడు బ్రాడ్. కానీ, రివ్యూలో ఫలితం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. చివరి వికెట్ అండర్సన్ది. బౌలర్ జయంత్ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశాడు, అంపైర్ లైట్ తీసుకున్నాడు. దాంతో, జయంత్ రివ్యూ కోరాడు. రివ్యూలో ఔట్ అని తేలింది. చివరి రెండు వికెట్లు - రెండు రివ్యూలు - రెండూ టీమిండియాకే అనుకూలం.. అదీ ఒకే బౌలర్కి సంబంధించి కావడం విశేషం.
విశాఖ మైదానం పూర్తిగా స్పిన్నర్లకే అనుకూలం అనుకోవడానికి వీల్లేదు.. ఫాస్ట్ బౌలర్లకీ వికెట్లు బాగానే పడ్డాయి. దాంతో, మ్యాచ్ని అభిమానులు మేగ్జిమమ్ ఎంజాయ్ చేశారనే చెప్పాలి. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 50వది. తనకు అచ్చి వచ్చిన మైదానంలో 50వ టెస్ట్ని, అదీ కెప్టెన్ హోదాలో కైవసం చేసుకోవడం వెరీ వెరీ స్పెషల్ అని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చెప్పాడు.
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 455 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 204 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులు చేసి, టీమిండియా విజయానికి పునాది వేసిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ని గెలుచుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more