విశాఖ టెస్టు: భారీ అధిక్యంలో గెలిచిన టీమిండియా 90 ఓవర్లు Spinners wrap up India's 246-run victory

Spinners wrap up india s 246 run victory

India vs England, visakha test, second innings, virat kohli, cheteshwar pujara, ravichandran ashwin, ravindra jadeja, gautam gambhir,Team india, second test, day 1, score update, r ashwin, wriddhiman saha, Virat Kohli, Adil Rashid ,India vs England score

India's bowlers required just 38.1 overs to wrap up a 246-run victory on the final day of the second Test in Visakhapatnam,

విశాఖ టెస్టు: భారీ అధిక్యంలో గెలిచిన టీమిండియా

Posted: 11/21/2016 06:09 PM IST
Spinners wrap up india s 246 run victory

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో పర్యాటక జట్టు ఇంగ్లాండ్ పై.. టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. భారత్ విసిరిన 405 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఐదవ రోజు భారత బౌలర్ల ముందు మోకరిల్లింది. 87 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదవ రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పై విరాట్ సేన 200 పైచిలుకు పరుగులతో విజయాన్ని సాధించాడు.

మ్యాచ్‌ చివర్లో రెండు వికెట్లు.. అత్యంత నాటకీయంగా పడ్డాయి. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రాడ్‌ ఎల్బీడబ్ల్యుగా ఔట్‌ అయినట్లు అంపైర్‌ ప్రకటిస్తే, రివ్యూకి వెళ్ళాడు బ్రాడ్‌. కానీ, రివ్యూలో ఫలితం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. చివరి వికెట్‌ అండర్సన్‌ది. బౌలర్‌ జయంత్‌ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్‌ చేశాడు, అంపైర్‌ లైట్‌ తీసుకున్నాడు. దాంతో, జయంత్‌ రివ్యూ కోరాడు. రివ్యూలో ఔట్‌ అని తేలింది. చివరి రెండు వికెట్లు - రెండు రివ్యూలు - రెండూ టీమిండియాకే అనుకూలం.. అదీ ఒకే బౌలర్‌కి సంబంధించి కావడం విశేషం.

విశాఖ మైదానం పూర్తిగా స్పిన్నర్లకే అనుకూలం అనుకోవడానికి వీల్లేదు.. ఫాస్ట్‌ బౌలర్లకీ వికెట్లు బాగానే పడ్డాయి. దాంతో, మ్యాచ్‌ని అభిమానులు మేగ్జిమమ్‌ ఎంజాయ్‌ చేశారనే చెప్పాలి. ఈ మ్యాచ్‌ విరాట్‌ కోహ్లీకి 50వది. తనకు అచ్చి వచ్చిన మైదానంలో 50వ టెస్ట్‌ని, అదీ కెప్టెన్‌ హోదాలో కైవసం చేసుకోవడం వెరీ వెరీ స్పెషల్‌ అని మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీ చెప్పాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 455 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 204 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్‌ అయిన ఇంగ్లాండ్‌, రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే ఆలౌట్‌ అయిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులు చేసి, టీమిండియా విజయానికి పునాది వేసిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ని గెలుచుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  visakha test  second innings  ravichandran ashwin  Virat kohli  Team india  cricket  

Other Articles