వరల్డ్ టీ 20లో పేలవమైన ప్రదర్శనతో ఇంటా బయట విమర్శలను ఎదుర్కోంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మరో వివాదానికి కారణమయ్యారు. పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్తో పాటూ మరో నలుగురు జాతీయ స్థాయి క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. వీరందరకీ ఫైసలాబాద్ కు చెందిన ఓ థియేటర్లో చోటుచేసుకున్న ఘర్షణలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ అదేశాలను ఖాతరు చేయని థియేటర్ సభ్యులపై దాడులకు పాల్పడ్డారన్న అరోఫణలపై పిసీబి విచారణకు అదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫైసలాబాద్ లోని ఓ థియేటర్ లో ఆదివారం రాత్రి జరిగిన డ్రామా షోకు అక్మల్, మరో నలుగురు క్రికెటర్లు హాజరయ్యారు. అయితే డ్రామాలో ఓ యువతి చేసిన నృత్యాన్ని మరోసారి చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు. దీనికి థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో తమ అదేశాలనే కాదంటారా..? అంటూ క్రికెటర్లు ధియేటర్ నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. ఈసంఘటన జరిగిన సమయంలో అక్మల్తో పాటూ క్రికెటర్లు అవాసిస్ జియా, బిల్ వాల్ బట్టి, మహ్మద్ నవాజ్, షాహిద్ యుసుఫ్లు ఉన్నారు.
దీనికి సంబంధించిన వీడియో పాక్ టీవీ చానళ్లలో చక్కర్లు కొట్టడంతో అక్మల్ వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యక్తిగత జీవితం వేరు.. తన క్రికెటర్ జీవితం వేరని అన్నాడు. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డడు ఆయనపై విచారణకు అదేశించడంలో అంతర్యమేమిటో అక్మల్ కే తెలియాలి. పైపెచ్చు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి రాద్దాంతం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అంతేకాదు పాకిస్థాన్ మీడియా వ్యవహర శైలిపై కూడా మండిపడ్డాడు.
వినోదం కోసం మాత్రమే ఆ థియేటర్లో డ్రామా చూడటానికి వెళ్లానని... అదేం తప్పు కాద కదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని హైలెట్ చేసి చూడకూడదని సూచించాడు. ఇంతవరకు బాగానే వున్న సమాజంలో క్రికెటర్ గా ఆయనకున్న గౌరవమర్యాదాలే అతనికున్న ఆస్తి అని తెలుసుకోకపోవడం అక్మల్ తప్పు. ఆయన క్రికెటర్ గా కాకుండా సాధారణ వ్యక్తిగా థియేటర్ లోనికి వెళ్తే.. ఆయన మరోమారు పాట పాడాలని ఎలా ధియేటర్ సభ్యులను డిమాండ్ చేస్తారని.. ఒక వేళ చేసివుంటూ ఆయన పరిస్థితి ఏమై వుండేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
క్రికెటర్లు వ్యక్తిగత జీవితంలోనూ హుందాగా వుండాలని, అప్పుడే వారిపై నున్న గౌరవం పెరుగుతుందని అభిమానులు కూడా సూచిస్తున్నారు. అయినా తాను జాతీయ జట్టుకు ఆడుతన్న క్రికెటర్ అని వారికి గుర్తుంటే ఇలాంటి చర్యలకు వారు దిగరని, తాము క్రికెటర్లం అని తెలిసి అహంభావంతో పెత్తనం చేయాలనుకున్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా అవుతాయని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇంతకు ముందుకూడా ఉమర్ అక్మల్ రెడ్ సిగ్నల్ పడినా.. దాటుకుని పోవడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగి, వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more