దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ ఐపీఎల్ నిర్వాహకులకు, ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలకు చుక్కెదురైంది. మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో మహారాష్ట్ర, ముంబాయి, పూణేలలో ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లను అడకూడదని, ముఖ్యంగా మే 1 తరువాత జరిగే అన్ని ఐపీఎల్ మ్యాచ్ లను ఇతర ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్ధించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడంతో పాటు వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలని సుప్రీంకోర్టు అదేశించింది.
మహారాష్ట్ర నుంచి నాగ్ పూర్, ఫూణే, వాంఖేడ్ స్టేడియంలలో ఎలాంటి మ్యాచ్ లను నిర్వహించరాదని బాంబే హైకోర్టు ఇటీవల దాఖలైన ప్రజాప్రయోజనవాజ్యాన్ని విచారించిన నేపథ్యంలో అదేశాలు జారీచేసింది, మహారాష్ట్రలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఏప్రిల్ 30 తరువాత నిర్వహించరాదని పేర్కోంది. ఈ లోపు ఇక్కడ జరగాల్సిన ఐపీఎల్ మ్యాచులను ఇతర ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది, ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మహారాష్ట్రలో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు అడేందుకు చాన్స్ లేకుండా పోయింది.
మహారాష్ట్రలో కరువు, నీటి కొరత కారణంగా ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 లోపు జరిగే ఆరు మ్యాచ్లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన మరో 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో మ్యాచ్లు జరగాల్సివుంది. కాగా బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర క్రికెట్ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడా వాటికి నిరాశ ఎదురైంది.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more