మహారాష్ట్రలోని తీవ్రవైన నీటి ఎద్దటి కారణంగా కరువు పట్టి పీడిస్తుందని, ఈ నేపధ్యంలో అక్కడ ఏప్రిల్ 30 తరువాత ఎలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను అనుమతించేది లేదని తేల్చిచెప్పిన బొంబే హైకోర్టు తీర్పును వెలువరించిన తరుణంలో.. మే 1న జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు మాత్రం నిర్ధేశిత పూణేలో అడేందుకు అనుమతించాలని బిసిసిఐ వేసిన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది, దీంతో మే 1 ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ను పుణెలో నిర్వహించనున్నారు.
మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడటం.. దీనికి తోడు ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణతో లక్షల లీటర్ల నీరు వృధా చేస్తున్నారని.. ఆ మ్యాచ్లను రద్దు చేయాలని కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరిగే అన్ని మ్యాచ్లను ఇతర వేదికలకు మార్చాలని ఆదేశించింది. అయితే తక్కువ వ్యవధిలో మ్యాచ్లు మరో వేదికకు మార్చడం కష్టతరం కావడంతో మే 1న జరిగే మ్యాచ్ను పుణెలో నిర్వహించేందుకు అనుమతించాలని బీసీసీఐ హైకోర్టును కోరింది. దీనికి కోర్టు అనుమతించింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 2న జరగనుంది.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more