టి-20 ప్రపంచ కప్ సాధించిన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీకి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కింది. సెయింట్ లూసియాలోని ది బ్యూసెజోర్ క్రికెట్ స్టేడియానికి స్యామీ పేరు పెట్టారు. ఈ స్టేడియం పేరును డారెన్ స్యామీ నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు. అయితే వెస్టీండీస్ జట్టు ఛాంపియన్లుగా అవతరించేందుకు జట్టు విజయంలో తన బ్యాట్ నుంచి అనేక పరుగులను రాబట్టిన జాన్సన్ చార్లెస్ కు కూడా అరుదైన గౌరవం దక్కింది, స్టేడియంలోని స్టాండ్లకు చార్లెస్ పేరును పెట్టి చార్లెస్ స్టాండ్లుగా నామకరణం చేశారు, సెయింట్ లూసియా క్రికెటర్లు స్యామీ, జాన్సన్ చార్లెస్లకు ప్రధాని కెన్నీ డీ ఆంథోనీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేడియం పేరు మార్పు విషయాన్ని ప్రకటించారు. స్టేడియంలోని ఓ స్టాండ్కు చార్లెస్ పేరు పెట్టనున్నారు.
స్వదేశంలో తనకు లభించిన స్వాగతసత్కారాల పట్ల స్యామీ ఉప్పొంగిపోయాడు. 'నాకు అరుదైన గౌరవం దక్కింది. అందరికీ ధన్యవాదాలు. సెయింట్ లూసియన్స్ ఎంతో ప్రేమిస్తారు. ఎయిర్పోర్టులో ప్రేమాభిమానాలు, గౌరవం దక్కాయి. ఓ మై గాడ్.. థ్యాంక్యూ వెరీ మచ్' అని స్యామీ ఉద్వేగంతో అన్నాడు. కరీబియన్ దీవులు వెస్టిండీస్ జట్టు పేరుతో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్ విజేత జట్టులో కెప్టెన్ స్యామీ, జాన్సన్ చార్లెస్ సెయింట్ లూసియాకు చెందినవారు. స్యామీ సారథ్యంలో విండీస్ రెండుసార్లు టి-20 ప్రపంచ కప్ సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ స్యామీ కావడం విశేషం.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more