ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ప్రస్తుతం రెండో ర్యాంక్లో కొనసాగుతున్న టీమ్ఇండియా(114 పాయింట్లు) తన ర్యాంక్ను నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియాపై కనీసం ఒక మ్యాచ్లోనైనా విజయం సాధించాలి. రేపటి నుంచి మొదలవుతున్న ఐదు వన్డేల సిరీస్లో ధోనీసేన వరల్డ్ నంబర్వన్ ఆస్ట్రేలియా(127)ను వారి సొంతగడ్డపై ఎదుర్కొనబోతోంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్ల్లో కనీసం ఒక దాంట్లో విజయం సాధించినా టీమ్ఇండియా రెండో ర్యాంక్కు ఎలాంటి ఢోకా ఉండదు. అలాగాకుండా ఐదు మ్యాచ్ల్లో ఓడితే మాత్రం అప్పుడు సౌతాఫ్రికా(112) తర్వాత మూడోర్యాంక్కు పడిపోవాల్సి ఉంటుంది. మరోవైపు టీమ్ఇండియా చేతిలో ఆసీస్ క్లీన్స్వీప్ ఎదుర్కొంటే పాయింట్ల పరంగా తేడావచ్చినా కంగారూల టాప్ర్యాంక్కు ముప్పుఉండదు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే టీమ్ఇండియా వైస్కెప్టెన్ కోహ్లీ 804 పాయింట్లతో రెండో ర్యాంక్లో ఉండగా, సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ డివిలియర్స్(900) ఫస్ట్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. టాప్-10లో భారత్ నుంచి కోహ్లీతో పాటు కెప్టెన్ ధోనీ, ధవన్ వరుసగా ఆరు, ఏడు ర్యాంక్ల్లో ఉన్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా తరఫున అశ్విన్(640) ఒక్కడే పదో ర్యాంక్లో ఉండగా, ఆసీస్ స్పిడ్స్టర్ మిచెల్ స్టార్క్(713) టాప్లో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో జడేజా(266) ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more