అమెరికాలోని హోస్టన్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ఆల్ స్టార్స్ రెండో టీ20 మ్యాచ్లో సచిన్ సేన పరాజయం పాలైంది. టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న సచిన్ జట్టు.. వార్న్ వారియర్స్ ముందు తేలిపోయారు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ సచిన్ సేన చతికిలపడింది. రెండవ మ్యాచ్ లో సచిన్ బ్లాస్టర్స్ ను 57 పరుగుల తేడాతో వార్న్ వారియర్స్ చిత్తు చేసింది. మూడు మ్యాచుల ఆల్ స్టార్ క్రికెట్ టి20 సిరీస్ లో భాగంగా వార్న్ జట్టు రెండు మ్యాచ్ లను గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.
వారియర్స్ నిర్దేశించిన 263 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన సచిన్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెహ్వాగ్ 16, సచిన్ 33, గంగూలీ 12, లారా 19, క్లుసెనర్ 21, స్వాన్ 22 పరుగులు చేశారు. చివర్లో షాన్ పొలాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. పొలాక్ 22 బంతుల్లో 7 సిక్సర్లు, ఫోర్ తో 55 పరుగులు పిండుకున్నాడు. వారియర్స్ బౌలర్ సైమండ్స్ 4 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ జట్టులో కుమార సంగక్కర్ అద్భుతంగా రాణించాడు. కాలిస్, సంగక్కర జోడీ కేవలం 7 ఓవర్లలో 91 పరుగులు బాగస్వామ్యంతో రాణించడం సచిన్ బ్లాస్టర్స్ కు శరాఘతంలా పరిణమించింది. సంగక్కర 30 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కల్లిస్ 45(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హేడన్ 32(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), వాగన్ 30(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్), సైమండ్స్ 19(6 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో వార్న్ సేన భారీ స్కోరు చేసింది. ఇంతటి భారీ స్కోరును చేధించడంలో సచిన్ సేన పూర్తిగా విఫలమై సీరీస్ ను కూడా చేజార్చుకుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more