క్రికెట్ను విశ్వవ్యాప్తం చేసేందుకు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ నిర్వహిస్తున్న ‘క్రికెట్ ఆల్ స్టార్స్’ టి20 లీగ్కు ఇవాళ తెర లేవనుంది. ముఖ్యంగా అమెరికా వాసులకు క్రికెటపై అభిమానం పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు దిగ్గజాలు సిద్దమయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో తమ అద్భుత విన్యాసాలతో ఆటపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాళ్లు మరోసారి ప్రపంచవ్యాప్త అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దీంట్లో భాగంగానే ఆయా దేశాల మాజీ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. తాము సాధించిన రికార్డులను, పక్కన బెట్టి.. వారి సత్తాను మరోమారు నేటి తరానికి పరిచయం చేయనున్నారు.
లీగ్లో భాగంగా సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరగనుండగా.. తొలి పోరుకు న్యూయార్క్లోని బేస్బాల్ స్టేడియం సిటీ ఫీల్డ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్లను చూసేందుకు అమెరికాకు చెందిన వెయ్యి మంది వర్ధమాన ఆటగాళ్లు కూడా స్టేడియాలకు రానున్నారు. అమెరికాలో ఈసారి సిరీస్ విజయవంతమైతే ప్రతీ ఏడాది ఇక్కడ మ్యాచ్లు ఆడించేందుకు సిద్ధంగా ఉన్నామని సచిన్, వార్న్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టీమ్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. గంగూలీ తనకు ఓపెనర్ అవకాశాన్ని ఇవ్వాలని ఇప్పటికే సచిన్ కోరడంతో.. గంగూలీ సెహ్వాగ్ ఇన్నింగ్స్ ను ప్రారంభింస్తారా..? లేక సచిన్, సెహ్వాగ్ ప్రారంభిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. లక్ష్మణ్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజాలతో సచిన్ జట్టు బ్యాటింగ్లో బలంగా ఉంది. ఇక బ్రియాన్ లారా, జయవర్ధనే, ఆల్రౌండర్ క్లూసెనర్ ప్రత్యర్థిని ఎలా కట్టడి చేస్తారన్నది కూడా కీలకంగా మారనుంది. బౌలింగ్ విభాగంలోనూ పేసర్లు అక్తర్, పొలాక్, మెక్గ్రాత్, స్పిన్నర్ మురళీధరన్, స్వాన్ లు వున్నారు.
కాగా వార్న్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నా వార్న్ వారియర్స్ జట్టులో కుమార సంగక్కర, రిక్కీ పాటింగ్, జాంటీ రోడ్స్, సైమండ్స్, మాధ్యూవ్ హెడన్ వంటి బ్యాట్స్ మన్లు దుమ్ము దులిపేందుకు సిద్దమంటున్నారు. ఈ జట్టులో గత నాలుగు మాసాల క్రితం వరకు క్రికెట్తో టచ్లో ఉన్న సంగక్కర కీలకంగా మారనున్నాడు. వార్న్ కూడా బిగ్బాష్లో మెరిసినవాడే. కలిస్ ప్రభావం చూపించవచ్చు. అటు బౌలింగ్లో 49 ఏళ్ల వసీం అక్రమ్, అగర్కర్ మరోసారి తన యార్కర్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వెటరన్ క్రికెటర్లు ఏ మేరకు అభిమానులను అలరిస్తారో..? ఎవరు ఎవరిపై విజయం సాధిస్తారో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more