ఢిల్లీ ఫిరోజ్షా కోట్ల మైదానంలో ఇద్దరు టీమిండియాకు చెందిన ప్రముఖ క్రికెటర్లు తన్నుకున్నారు. అదీ ఎంతలా అంటే.. అడ్డుకునేందుకు వచ్చిన అంఫైర్ ను కూడా తోసేసి మా మద్యలోకి రావద్దంటూ తోసేయడంతో పాటు హెచ్చరించేవరకు వెళ్లింది. అంతటితో ఆగని ఓ క్రికెటర్ కాలేజ్ విద్యార్థి మాదిరిగా బయటకురా చూసుకుందామని సవాల్ చేయడం వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ మ్యాచ్ సందర్భంగా గౌతం గంభీర్, మనోజ్ తివారీ కొట్టుకున్నారు. రంజీ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
ఇద్దరు కెప్టెన్ మధ్య చోటుచేసుకుంటున్న వివాదాన్ని సమసిపోయేలా చర్యలు తీసుకునేందుకు మధ్యలో జోక్యం కల్పించుకున్న అంపైర్ శ్రీనాథ్ను కూడా గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. మ్యాచ్ రిఫరీ గౌతం గంభీర్, మనోజ్ తివారీకీ సమన్లిచ్చారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఎనిమిదో ఓవర్ సందర్భంగా తివారీకి, గౌతం గంభీర్కు మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. మ్యాచ్ అయిపోనీ, బయటకెళ్లాక నా తడాఖా చూపిస్తా అంటూ గౌతం గంభీర్ మనోజ్ తివారీని బెదిరించినట్లు తెలిసింది.
తివారీ, గంభీర్ల మధ్య కొట్లాటను అదుపు చేసేందుకు యత్నించిన ఎంపైర్ శ్రీనాథ్ను గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. తమ గొడవ మధ్యలోకి రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. కాగా ఎంపైర్ శ్రీనాథ్ను తోసివేసిన గంభీర్పై నిషేధం తప్పదని సమాచారం. ఇప్పటికే మ్యాచ్ రిఫరీ ఆటగాళ్లిద్దరికీ సమన్లు పంపడంతో గౌతం గంభీర్పై నిషేధం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎంత కాలం నిషేధం విధిస్తారు. ఏ ఏ మ్యాచ్లలో గంభీర్పై నిషేధం ఉంటుందనే సమాచారం తెలియాల్సి ఉంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more