ఒత్తిడిలో రాణించాలంటే కేవలం కఠోర శిక్షణ ఓక్కటే సరిపోదని, దానిని అదిగమించేందుకు ధీటైన ప్రత్యర్థి జట్టుతో అధిక మ్యాచ్లు అడటం ఒక్కటే మార్గంగా చెప్పుకోచ్చారు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెస్టెన్ ఇంజమామ్ ఉల్ హక్. ఒత్తిడిలో కూడా చక్కటి ప్రదర్శన చేయాలంటే ముఖ్యంగా భారత్తో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని ఆయన పాకిస్తాన్ దేశ క్రికెటర్లకు సూచించాడు. భారత్తో రెగ్యులర్గా సిరీస్లు ఏర్పాటు చేయాలని పీసీబీని కోరాడు. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా టూర్లను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తాము ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు కష్టపడ్డాం. అయితే ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆయా జట్లతో ఆడినప్పుడు నేర్చుకున్నామన్ని చెప్పాడు.
ప్రస్తుత క్రికెటర్లు ఒత్తిడిలో ఆడాలంటే ఉన్న చక్కటి అవకాశం రెగ్యులర్గా భారత్తో మ్యాచ్లు ఆడడమే' అని వ్యాఖ్యానించాడు. భారత్-పాక్ మధ్య సిరీస్ జరిగితే చూడాలని ఉందన్నాడు. భారత్తో ఎక్కడ ఆడామనేది కాకుండా, రెగ్యులర్గా ఆడితే లాభం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తమ క్రికెట్లో ఉన్న రాజకీయాలను తట్టుకొని కూడా యూనిస్ ఖాన్ ఆటపై దృష్టిపెడుతున్నాడని మెచ్చుకున్నాడు. పాక్ తరఫున టెస్టుల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాలని ఆకాంక్షించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more