చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తారు. కానీ ఆదివారం రాత్రి ఎమ్ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మాత్రం కాస్తంత భిన్నంగా కనిపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)8వ ఎడిషన్లో భాగంగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్ధాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో రాజస్ధాన్ రాయల్స్ జట్టు 27 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సందర్భంలో ఫైనల్ ఓవర్ను 'కెప్టెన్ కూల్' ధోని.... డ్వేన్ బ్రేవోని వేయమని కోరాడు.
దీంతో డ్వేన్ బ్రేవో వేసిన తొలి బంతిని రాజస్ధాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ క్రిస్ మెర్రిస్ సిక్స్గా మలిచాడు. అంతే కాదు పుల్ టాస్ బంతి కావడంతో అంఫైర్ దీనిని నోబాల్గా ప్రకటించాడు. దీంతో తొలి బంతికే రాజస్ధాన్కు ఏడు పరుగుల లభించాయి. డ్వేన్ బ్రేవో వేసిన రెండో బంతిని క్రిస్ మెర్రిస్ డీప్ మిడ్ వికెట్ వైపు బాదాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా ఆ బంతిని కీపర్ ధోనికి విసిరాడు. ఈ క్రమంలో రాజస్ధాన్ బ్యాట్స్మెన్లు అంకిత్ శర్మ, క్రిస్ మెర్రిస్ రెండు పరుగులు తీశారు.
ఒక పరుగు లభించాల్సిన చోటు రవీంద్ర జడేజా అలసత్వం కారణంగా రెండు పరుగులు లభించడంతో ధోని కాస్తంత కోపోద్రిక్తుడయ్యాడు. ఆ సమయంలో కామెంటేటరీ చెబుతున్న మాజీ టీమిండియా బ్యాట్స్మెన్ అరుణ్ లాల్, ధోని చూపులు జడేజాని చంపే విధంగా ఉన్నాయని, అవసరమైతే ఖననం కూడా చేస్తాయని వ్యాఖ్యానించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఒక్క రవీంద్ర జడేజానే కాదు, ఎక్కువ మంది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు క్యాచ్లను వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ లాంటివి చాలానే చేశారు. ఏదైతేనేం మ్యాచ్ చివరకు చెన్నై జట్టే, రాజస్ధాన్పై 12 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్కు మరోసారి తిరుగులేదని నిరూపించింది. 16 పాయంట్లతో పట్టికలో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more