ఐపీఎల్-8 సిరీస్ లో ధోనీ సేన జైత్రయాత్ర కొనసాగిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఈ లీగ్ దశలో 12 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు.. 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు.. సొంతగడ్డపై తమకు తిరుగులేదని ఈ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఇక చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ జట్టును ఓడించి.. చెన్నై ప్లే ఆఫ్ కు దూసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. మొదట రాజస్థాన్ బౌలర్లు చెన్నై బ్యాట్స్ మెన్లను బాగానే కట్టడి చేశారు కానీ.. ఆ తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ బ్రెండన్ మెకల్లమ్ (81), డు ప్లెసిస్ (29) ఇద్దరూ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇక చివర్లో ధోనీ (13), డ్వేన్ బ్రావో (15) తమదైన రీతిలో బాదేశారు. దీంతో చెన్నై జట్టు 157 పరుగులను సాధించగలిగింది.
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. టాప్ స్కోరర్ గా కొనసాగుతున్న రహానే (23), వాట్సన్ (28) పేలవ పెర్ఫార్మెన్స్ తో పవేలియన్ చేరడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక ఆల్ రౌండర్ జడేజా తన బంతితో మ్యాజిక్ చేయడంతో ఈ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 ఓవర్లలో11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
ఇక జడేజాతోపాటు మోహత్ శర్మ (3/25) కూడా తన బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించడంతోపాటు రాయల్స్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. చివర్లో శామ్సన్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫాల్క్నర్ (13 బంతుల్లో 16; 2 ఫోర్లు)లు ఆరో వికెట్కు 33 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపారు. కానీ.. చెన్నై బౌలర్ల ధాటిముందు నిలబడలేకపోయారు. దీంతో రాయల్స్ జట్టు చెన్నై ముందు తోకముడవక తప్పలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more