గతంలో ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో యువరాజ్ కి వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇండియా జట్టులో స్థానం లభించని విషయం తెలిసిందే! దీంతో ఇతగాడు నానాకష్టాలు పడి రంజీ ట్రోఫీల్లో తిరిగి ఫామ్ లోకొచ్చాడు. భారీ షాట్లతో మైదానంలో పరుగుల వర్షాన్ని కురిపించి తన సత్తా చాటుకున్నాడు. ఈ విధంగా ఇతని ప్రదర్శనను చూసి ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా ఢిల్లీ ఫ్రాంచైజీ వర్గాలు భారీ మొత్తం (రూ.16 కోట్లు) ముట్టజెప్పి కొనుగోలు చేసింది. ఈసారి జరిగే ఐపీఎల్ లో ఇతడు అద్భుతంగా రాణిస్తాడని యావత్ క్రికెట్ అభిమానులూ ఆశించారు.
కానీ.. అలా ఏమీ జరగలేదు. ఒకటి, రెండు మ్యాచులు మినహా మిగతా మ్యాచులన్నింటిలోనూ యువీ పేలవ పెర్ఫార్మెన్స్ తో రాణిస్తూ వస్తున్నాడు. దీంతో ఇతని మీద తీవ్ర విమర్శలు రావడం మొదలయ్యాయి. ఒకప్పుడు యువీ బెస్ట్ అని నినాదాలు చేసినవారే ఇప్పుడు అతనిని వేస్ట్ అంటూ పేర్కొంటున్నారు. తన ప్రతిభను నిరూపించుకోవడం కోసం యువీ బాగానే ప్రయత్నాలు చేశాడు కానీ ఫలితం లేకపోయింది. మొన్న ముంబైతో జరిగిన మ్యాచులో యువీ 44 బంతుల్లో 57 పరుగులు చేసినా.. ఢిల్లీ జట్టు పరాజయం పాలయ్యింది. ఢిల్లీ ఈ విధంగా పరాజయం పాలవడం వెనుక యువీ పేలవ పెర్ఫార్మెన్సేనంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
‘ఈ విధంగా విమర్శలు వస్తున్నాయి కదా.. మరి వాటిపై మీ స్పందనేంటి?’ అని యువీని ప్రశ్నిస్తే.. వాటిని పట్టించునేంత సమయం తనకు లేదంటూ ధీమాగా సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ.. ‘తనపై వస్తున్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెబుతానే తప్ప.. వాటి గురించి ఆలోచించేంత సమయం కేటాయించలేను’ అంటూ వెల్లడించాడు. అలాగే ముంబై చేతిలో ఓడిన మ్యాచ్ గురించి తెలుపుతూ.. ఆరోజు వరుణుడు తమ విజయావకాశాలపై ప్రభావం చూపాడని అన్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more