ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రేక్షకులకు కనులపండుగగా వుంటే ఆటగాళ్లకు ఎంతో అనుకూలమైన ప్లాట్ ఫారం! అందరిలోనూ ఉత్సాహం పెంచే ఈ ఐపీఎల్.. ఫ్రాంచైజీల్లో మాత్రం నిరుత్సాహం నింపుతోంది. అంతేకాదు.. ఎవ్వరూ ఊహించలేని ఖరీదైన కష్టాలే తెచ్చిపెడుతోంది. ఆటగాళ్లకు అనుకూలంగా నిబంధనలు వున్న నేపథ్యంలో ఈ సీజన్ లో ఫ్రాంచైజీలకు చుక్కలు కనిపిస్తున్నాయని సమాచారం!
వివరాల్లోకి వెళ్తే.. గాయం కారణంగా కనీసం ఒక్క మ్యాచులోనూ బరిలోకి దిగని ఆటగాడికి కూడా యాభై శాతం జీవతం ఇవ్వాలన్న నిబంధన విధించడం జరిగింది. ఈ నిబంధనే ఫ్రాంచైజీలకు తెగ ఇబ్బందులకు గురిచేస్తోంది. అలా తీవ్ర ఇబ్బందికి గురవుతున్న ఫ్రాంచైజీల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఢిల్లీ ఆటగాడైన మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఇంతవరకు ఒక్క మ్యాచులోనూ ఆడలేదు. అయినప్పటికీ ఇతగాడు నిబంధనల ప్రకారం తన యాభై శాతం ఫీజు మాత్రం అందుకోనున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొని ఆయా జట్టు క్యాంప్ లో రిపోర్టు చేసిన ఆటగాడు.. ఆపై టోర్నీలో ఆడకపోయినా వేలంలో దక్కించుకున్న మొత్తంలో యాభై శాతం ఫీజు పొందేందుకు అర్హుడనే నిబంధన వుండటంతో.. ఇతనికీ అలాగే ఫీజు దక్కనుంది. దీంతో షమీకి ఢిల్లీ యాజమాన్యం సగం అంటే రూ. 2.12 కోట్లు వేతనంగా ఇవ్వాల్సి వుంటుంది.
ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి అయితే మరోలా వుంది. ఓపెనర్ అయిన ఆరోన్ ఫించ్ మొదట రెండు మూడు మ్యాచులు ఆడాడు కానీ.. తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇతడు మ్యాచ్ లో గాయపడ్డాడు కాబట్టి.. ముంబై అతనికి మొత్తం జీతం చెల్లించాల్సి వుంది. ఇంతేకాదు.. టోర్నీలో జీతం చెల్లింపు విధానంలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలూ వున్నాయి. వేలంలో ఎంపికై జట్టు ట్రయల్ మ్యాచ్ లో పాల్గొన్న ఆటగాడికి మొత్తం ఫీజు చెల్లించాల్సి వుంటుందని రెండు ఫ్రాంచైజీలకు చెందిన అధికారులు తెలిపారు. ఏదేమైనా.. ఈ ఐపీఎల్ నిబంధనల ధాటికి ఫ్రాంచైజీలకు చుక్కలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more