భారతీయ క్రికెట్ టీమ్ సారథి మహేంద్రసింగ్ ధోనీ మీద యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు సంధించారు. ఇటీవలే జరిగిన వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టులో తన కొడుకు యువరాజ్ కు చోటు దక్కకపోవడానికి ధోనీయే కారణమని యోగరాజ్ ఆరోపించిన విషయం తెలిసిందే! ధోనీ పన్నాగం పన్ని కావాలనే యువీకి జట్టులో స్థానం దక్కకుండా చేశాడని ఆయన ఇదివరకే మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ధోనీని రావణాసురుడితో పోల్చుతూ అతనిమీదున్న అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఈ నేపథ్యంలోనే ధోనీని రావణాసురుడితో యోగరాజ్ పోల్చుతూ.. 'ధోనీ దురహంకారి. ఇలాగే అహంకారంతో విర్రవీగిన రావణుడి కథ ముగిసింది. ధోనీ కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించక తప్పదు. రావణుడి కంటే గొప్పవాడని ధోనీ భావిస్తున్నాడు. అలా భావించిన ధోనీ రావణాసురుడిలాగే కుప్పకూలిపోతాడు. ఇతర క్రికెటర్లు ధోనీ గురించి నా వద్దకు వచ్చి చెప్పునప్పుడు నేను చాలా సిగ్గుపడేవాడిని. అసూయవల్ల ధోనీ అంటే వారికి పడేదికాదని మొదట్లో అనుకునేవాడ్ని కానీ.. ఎప్పుడైతే ఇతర క్రికెటర్లు అతని గురించి చెప్పారో.. అతనిలాంటి ఘోరమైన వ్యక్తిని నా జీవితంలో చూడలేదని అనుకుంటున్నాను’ అని అన్నారు.
అలాగే.. ‘2011 ప్రపంచ కప్లో యువరాజ్ను ఆపి ధోనీ బ్యాటింగ్కు వెళ్లి హీరో అయ్యాడు. 2015 ప్రపంచ కప్ సెమీస్లో ధోనీ నాలుగో స్థానంలో ఎందుకు బ్యాటింగ్కు దిగలేదు' అని యోగరాజ్ విమర్శించారు. ‘నిజంగా.. ధోనీ చేసిందేమీ లేదు. మీడియా వల్లే ధోనీ క్రికెట్ దేవుడయ్యాడు. మీడియా ధోనీని గొప్పగా చిత్రీకరించింది. కానీ ఇప్పుడు మీడియా ముందు కూర్చొని మీడియా వ్యక్తులనే అవహేళన చేస్తున్నాడు. తనకు ఎనలేని హైప్ తెచ్చిపెట్టిన మీడియాపైనే పరిహాసమాడుతున్నాడు. ఒకవేళ నేనే గనుక మీడియా వ్యక్తినైతే.. అక్కడే ధోనీ చెంప పగలకొడతా’ అని యోగ్రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more