ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రానే వచ్చేసింది. మరి కోన్ని గంటల్లో ఐపీఎల్-8 సీజన్ మ్యాచ్ లు ఆరంభం కానుంది. ఈ ఆరంభ వేడుకలకు కోల్కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా సాగాయి. ఐపీఎల్ ఆరంభ వేడుకలను మంగళవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్కు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రదాన ఆకర్షణగా నిలిచారు. తమ డ్యాన్స్ షోలతో అలరించడానికి హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ తో పాటు అనుష్క శర్మలు సన్నద్ధమైయ్యారు. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 8 ప్రారంభ కార్యక్రమ వేదిక విద్యుత్ దీపకాంతులతో ముస్తాబైంది.. ఈ కార్యక్రమం వాస్తవానికి సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కావాల్సి వున్నా.. అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అయితే ఇప్పటికే అభిమానులతో వేదిక ప్రాంగణం మొత్తం కిక్కిరిసిసోయింది.
అటు వన్డే ప్రపంచ కప్ మధురస్మృతులు మదిలో మెదులుతుండగానే.. మండు వేసవిలో పరుగుల వర్షంతో ముంచెత్తడానికి టీ 20 తో ఐపీఎల్ క్రికెట్ పండగ వచ్చేసింది. ఐపీఎల్ 8వ సీజన్ 47 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో అభిమానులను కనువిందు చేయనుంది. పోటీలు బుధవారం లాంఛనంగా ప్రారంభమవుతాయి.
కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరుగుతుంది. కోల్కతాకు గంభీర్, ముంబైకి రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. ఐపెఎల్-8లో మొత్తం 8 జట్లు బరిలో దిగుతున్నాయి. కోల్కతా, ముంబైతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో మ్యాచ్లు జరగనున్నాయి.
మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ కోల్ కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఈసారి రాయల్ చాలెంజర్స్ తో పాటు ఢిల్లీ డేర్ డేవిల్స్ ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇరు జట్లలో బలమైన బ్యాటింగ్ లైనప్ కల్గి ఉండటంతో ఇందుకు కారణం. ఐపీఎల్ ఆరంభం అయ్యి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ లు ఒక్క టైటిల్ ను కూడా చేజిక్కించుకోలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more