ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా ప్రధాన జట్లలోని కొందరు స్టార్ ఆటగాళ్లు అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. అందులో కోహ్లీ, డివిలియర్స్, మాక్స్ వెల్ తదితర ఆటగాళ్లు మైదానంలో పరుగుల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఆపదలో వున్న సమయంలో ఈ ఆటగాళ్లే తమ జట్టును ఆదుకుంటూ గెలుపు దిశగా తీసుకెళుతున్నారు. ఇక సగటు అభిమానులంతా వీరిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వీరందరికంటే శ్రీలంక జట్టు ఆటగాడు సంగక్కర ఇంకా డేంజరంటూ మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ ముగ్గురు ఆటగాళ్లు బాగానే ఆడుతున్నారు కానీ.. వారికంటే సంగక్కరను చూసి అన్ని టీంలు భయపడుతున్నాయంటూ అతను పేర్కొంటున్నాడు.
ఈ వరల్డ్ కప్ లో సంగక్కర్ గా వరుసగా మూడు మ్యాచుల్లోనూ సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. మొత్తం 5 మ్యాచుల్లో 377 స్కోరు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సంగక్కరను చూసి ఇతర టీంలు భయపడుతున్నాయని మరళీధరన్ పేర్కొన్నాడు. సంగక్కర రూపంలో వన్డే క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ను లంక కలిగివుందని ఐసీసీ వెబ్ సైట్ కు రాసిన కాలమ్ లో ఆయన అభిప్రాయపడ్డాడు. ‘మీరు కోహ్లీ, డివిలియర్స్ లేదా మ్యాక్స్ వెల్ గురించి మాట్లాడుకోవచ్చు. వీరందరూ ప్రస్తుతం టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడుతున్నారు. అయితే.. వీరందరి కంటే సంగక్కరను చూసి అన్ని టీంలు భయపడతాయి’’ అంటూ ముత్తయ్య అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అలాగే.. పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఎదుర్కొన్న బంతులకంటే అధిక పరుగులు సాధించడమే అభినందనీయమని మురళీ పేర్కొన్నాడు. తన చివరి వరల్డ్ కప్ ఆడుతున్న సంగక్కర.. కప్ గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడని, ఆ దిశగానే అధిక పరుగులు చేస్తూ తన జట్టును ఆదుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్నాడని మురళి చెప్పాడు. ఇదిలావుండగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సంగక్కర సెంచరీతో రాణించినప్పటికీ.. శ్రీలంక ఓటమిపాలైన విషయం తెలిసిందే!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more