భారత్ క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లను టీవీలో వీక్షించేందుకు గాను క్రికెట్ అభిమానులు ఎలాంటి స్పోర్ట్స్ ప్యాకేజీలకు సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లు దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దూరదర్శన్లో మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తే, కేబుల్ టీవీ ఆపరేటర్లు ఉచితంగా ఫీడ్ పొందుతారని, అందువల్ల తాము ఆర్ధికంగా నష్టపోతామని స్టార్ టీవీ నెట్ వర్క్, బీసీసీఐలు కోర్టులో వాదించాయి. వీరి వాదనను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. జస్టిస్ రంజన్ గోగాయ్, జస్టిన్ పినాకి చంద్ర ఘోస్ నేతృత్వంలోని బెంచ్ మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు సైతం మ్యాచ్లను వీక్షించాలంటే దూరదర్శన్ పైనే ఆధారపడతారు, ఏడు సంవత్సరాలుగా ఉచితంగా ఫీడ్ను పొందుతున్నారు. దానినే కంటిన్యూ చేయండంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఎట్టి పరిస్ధితుల్లో దూరదర్శన్లో మ్యాచ్లను ప్రసారం చేయాల్సిందేనంటూ ఆదేశించి, దీనిపై స్టార్ స్పోర్ట్స్ వారి సలహాలను సమర్పించడానికి ఫిబ్రవరి 17 వరకు గడువిచ్చింది. ఫిబ్రవరి 14న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15న అడిలైడ్లో టీమిండియా, పాకిస్ధాన్తో తలపడనుంది. ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ని ఆస్టేలియా-న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు టోర్నమెంట్ జరగనుంది. ఐసీసీ వరల్డ్ ఫైనల్కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తుంది.
.జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more