ఛాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా చేజిక్కుంచుకోవాలనుకున్న భారత కల నెలవేరింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన నెంబర్ 1 టీం ధోని సేన ఎన్నో ఒత్తిడిలతో ఇంగ్లాండులో అడుగుపెట్టినా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా దూకుడుగా ఆడుతూ ఫైనల్ కిచేరింది. ఫైనల్లో కాస్తంత తడబడినా, చివరికి విజయాన్ని సొంతం చేసుకొని చిట్టచివరి ఛాంపియన్స్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకొంది. నిన్న రాత్రి ఇంగ్లాండ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ని ఓడించింది. పేరుకు 50 ఓవర్ల మ్యాచ్ అయినా, వర్షం కారణంగా టి-20 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గా మారింది. పిలువని పేరంటానికి వరుణుడు తాను ఉన్నానంటూ వచ్చేసి.. మ్యాచ్ కొనసాగింపుపై అనుమానాలు రేకేత్తించాడు. భారీగా వర్షం కురవడంతో ఓ దశలో మ్యాచ్ జరగడంపై అనేక సందేహాలు తలెత్తాయి. మ్యాచ్ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో మ్యాచ్ ను 24 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే మళ్లీ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారడంతో మళ్లీ మ్యాచ్ పరిస్థితి మొదటికి వచ్చేసింది. అయితే చివరికి వరణుడు కరుణించడంతో మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించారు..
మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 129 పరులు చేసింది. శిఖర్ ధవన్ (31), విరాట్ కోహ్లీ (43), జడేజా (33 నాటౌట్) లు ఆదుకోగా, రైనా, ధోని, రోహిత్ విఫలం అయ్యారు. కోహ్లీ, జడేజా ధాటిగా ఆడటంతో ఆ మాత్రం స్కోరు సాధించింది. భారత్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కుక్సేన పూర్తి ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. ఇయాన్ మోర్గాన్ (33), బొపార (30) పోరాడినా ఫలితం దక్కలేదు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 46 పరుగులకే నాలుగు వికెట్లు పడినా కోలుకుని విజయం దిశగా సాగిన ఇంగ్లండ్ చివర్లో తడబడింది. చివర్లో ఇషాంత్, జడేజా వరుస వికెట్లు తీసి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు కుమ్మరించారు. విజయానికి 16 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన తరుణంలో వరుస బంతుల్లో మోర్గాన్, బొపారా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను మరోసారి దురదృష్టం వెక్కిరించింది. తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ అందుకోవాలన్న ఆతిథ్య ఇంగ్లండ్కు నిరాశే మిగిలింది. రానున్న విండీస్ టూర్లో భారత్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more