ఇప్పటిదాకా క్రికెట్తోనే పూర్తిగా మమేకమైన మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్... తాజాగా మరో క్రీడతోనూ అనుబంధం ఏర్పరచుకోనున్నాడు. ఐపీఎల్ తరహాలో తొలిసారి ప్రవేశ పెడుతున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో సచిన్ ఢిల్లీ ఫ్రాంచైజీని కొన్నట్టు సమాచారం. అయితే జట్ల యాజమాన్యం ఎవరనేది ఈ నెల 28న అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది. హైదరాబాద్ ఫ్రాంచైజీని పీవీపీ వెంచర్స్, లక్నోను సహారా సంస్థ కొనుగోలు చేసినట్టు తెలిసింది. రూ.5.5 కోట్ల ప్రైజ్మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆగస్టు 14 నుండి 31 వరకు దేశంలోని ఆరు నగరాల్లో జరుగుతుందని జాతీయ బాడ్మింటన్ సంఘం సంయుక్త కార్యదర్శి కె. పున్నయ్యచౌదరి చీరాలలో తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, పుణె, లక్నో, హైదరాబాద్, ముంబై పేర్లతో ఆరు జట్లు లీగ్లో తలపడుతున్నాయన్నారు. ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులు ఉంటారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more