గత కొంత కాలం నుండి పొడుగు, పొట్టి క్రికెట్ ఫార్మాట్లలో రాణిస్తూ, భావి తరం టీం ఇండియా కెప్టెన్ గా చెప్పబడుతున్న విరాట్ కోహ్లీ నిన్న రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో వీర విహారం చేసి జట్టును గెలిపించాడు. ఢిల్లీలోని ఫిరోషా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు చివరి వరకు పోరాడి ఉత్కంఠ విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో అంత్యంత పేవల ఆటతీరును ప్రదర్శిస్తున్న ఢిల్లీ మరో ఓటమిని మూటగట్టుకుంది. బెంగుళూరు జట్టులో కోహ్లీతో పాటు ఉనాద్కట్ రాణించడంతో బెంగుళూరు పరువు నిలుపుకుంది. టాస్ గెలిచి బెంగుళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించిన ఢిల్లీ బౌలర్లను బెంగుళూరు బ్యాట్స్ మెన్స్ ఓ ఆట ఆడుకున్నారు. గేల్ (4) తో వెనుదిరిగినా, కోహ్లి (58 బంతుల్లో 99; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. పుజారా (17), హెన్రిక్స్ (26) కెప్టెన్కు అండగా నిలిచారు. డివిలియర్స్ (17 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్లలో మెరిశాడు. దీంతో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ చివరి దాకా పోరాడినా ఫలితం లేకపోయింది. జయవర్ధనే (19), సెహ్వాగ్ (18) మరోసారి నిరాశపరిచారు. ఢిల్లీ కెప్టెన్ వార్నర్ (4) కూడా విఫలమయ్యాడు. ఉన్ముక్త్ చంద్ (35 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్), రోహెర్ (27 బంతుల్లో 32; 4 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్కు 58 పరుగులు జోడించి ఢిల్లీ శిబిరం లో ఆశలు పెంచారు. చివర్లో ఇర్ఫాన్(11 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) , మోర్కెల్ (10 బంతుల్లో 19; 3 ఫోర్లు) కలిసినా ఢిల్లీని విజయతీరాలకు చేర్చలేకపోయారు. కేవలం 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకొని విజయంలో కీలక పాత్ర పొషించిన ఉనాద్కన్ కి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more