బ్యాటింగ్లో విఫలమైన తెలుగు వారియర్స్ జట్టు... సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్ 26 పరుగుల తేడాతో వారియర్స్పై విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఫైనల్కు దూసుకొచ్చిన కర్ణాటక ఈసారి మాత్రం అవకాశాన్ని జారవిడుచుకోలేదు. టైటిల్ పోరులో పటిష్టమైన వారియర్స్కు అడ్డుకట్ట వేసి చాంపియన్గా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్ణాటక బుల్డోజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 122 పరుగులు చేసి ఓటమిపాలైంది. తేజ (23 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆదర్శ్ (33 బంతుల్లో 22; 1 ఫోర్), నందకిశోర్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గిరి (15 బంతుల్లో 16; 2 ఫోర్లు) కాసేపు పోరాడారు. ఆరంభంలో వికెట్లు కోల్పోవడం వారియర్స్ను దెబ్బతీసింది. ఓపెనర్లు ప్రిన్స్ (5), ఆదిత్య (5) విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో అభిమన్యు 2, హిమ్మత్, కార్తీక్, ప్రదీప్, మంజునాథ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more