అనేక వివాదాల నడుమ, మూడు సార్లు వాయిదాపడ్డ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఐ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయ్ కుమార్ మల్హోత్రా ఎన్నికయ్యాడు. మల్హోత్రా ఈ పదవిలో 1973 నుండి కొనసాగుతుండటం గమనార్హం. అయితే, ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా ఎన్నికవగా ప్రస్తుతం మాత్రం పోటీలో నెగ్గాడు.
మల్హోత్రా 72 ఓట్లు, ఆయనపై పోటీ చేసిన బివిపి రావు 20 ఓట్లు సాధించారు. సీనియర్ ఉపాధ్యక్షుడిగా త్రిలోచన్ సింగ్, కోశాధికారిగా వీరేంద్ర సచ్దేవ్ గెలిచారు. ప్రధాన కార్యదర్శి, ఏడుగురు సంయుక్త కార్యదర్శులుగా మల్హోత్రా వర్గానికి చెందినవారు ఏకగ్రీవంగా ఎన్నికవడం గమనార్హం. రాష్ట్రానికి చెందిన అనిల్ కామినేని ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నాడు.
కాగా, ఎలక్టోరల్ కాలేజిపై ఎఎఐ వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ నమోదవడంతో రిటైర్డ్ జస్టిస్ జెడి కపూర్ను రిటర్నింగ్ అధికారిగా కోర్టు నియమించింది. దీంతో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపురకు ఓటింగ్ హక్కు లభించింది. ఎన్నికల్లో ప్రతీ రాష్ట్ర శాఖకు మూడు ఓట్లు, క్రీడా సంఘాలకు ఒక ఓటు కేటాయించారు. జాతీయ క్రీడాభివృద్ధి నియమావళి ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా ఎఎఐను ఆదేశించాలంటూ ఒక న్యాయవాది వేసిన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది.
ఈ నియమావళిని అమలుపరిస్తే ఎఎఐ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి మల్హోత్రా అనర్హుడవుతాడు. కాగా, ఎఎఐ ఎన్నికలు 40 ఏళ్ల తర్వాత తొలిసారి పారదర్శకంగా జరిగినందుకు ఆనందంగా ఉందని ఎన్నిల్లో ఓటమిపాలైన క్లీన్ స్పోర్ట్స్ ఇండియా కన్వీనర్ (సిఎస్ఐ) బివిపి రావు అన్నాడు. అయితే, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మలోహ్రతా గెలిచారని చెప్పాడు.
దేశంలో ఆర్చరీ అభివృద్ధికి కృషిని కొనసాగిస్తానని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఐ) అధ్యక్షుడిగా ఎన్నికైన విజయ్ కుమార్ మల్హోత్రా హామీ ఇచ్చాడు. భారీ విజయం సాధించడంపై అతను హర్షం వ్యక్తం చేశాడు. భారత ఆర్చర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం గర్వకారణమన్నాడు. ఇక ముందు కూడా మన ఆర్చర్లు దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా తాను అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని అన్నాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more