నాగోబా జాతర కథ :
క్రీ.శ. 740వ సంవత్సరంలో జరిగిన కథ ఇది. కేస్లాపూర్ అనే గ్రామంలో పడియేరు శేషసాయి అనే ఒక నాగభక్తుడు వుండేవాడు. నాగదేవతలను దర్శించుకోవడానికి ఒకరోజు ఇతడు నాగలోకానికి వెళ్లాడు. అయితే ఇతడు సామాన్య మానవుడు కాబట్టి నాగలోక ద్వారపాలకులైన సైనికులు శేషసాయిని అడ్డుకుని దర్శనం చేయకుండా నిలిపివేశారు.
దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన అతగాడు... తిరిగి వస్తుండగా పొరపాటున నాగలోక ద్వారాలను తాకుతాడు. అయితే ఒక సామాన్య మానవుడు తన ద్వారాలను తాకిన విషయాన్ని తెలుసుకున్న నాగరాజు అతని మీద కోపంతో రగిలిపోతాడు.
ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకు తెలిసిన ఒక పురోహితుడు దగ్గరికి వెళతాడు. తనతో జరిగిన విషయాన్ని ఆ పురోహితుడికి వివరించి... నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని తెలుసుకున్నాడు.
ఏడు కడవల ఆవుపాలతోపాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర రకాలతో నాగరాజుకు నైవేద్యాలు సమర్పించాడు. 125 గ్రామాలమీదుగా పయనిస్తూ, పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకంచేశాడు.
ఈయన భక్తిని మెచ్చుకున్న నాగరాజు... అతనిని ఏ హాని కలిగించకుండా వదిలేసి, కేస్లాపూర్ ప్రాంతంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆ స్థలమే ‘నాగోబా’గా ప్రిసిద్ధికెక్కింది. అప్పటి నుంచి మొదలైన ఈ జాతర.. ఇప్పటికి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.
నాగోబా పూజా విధానం :
గిరిజనులు ఈ పూజాకార్యక్రమాన్ని నిర్వహించుకునే ముందు... గోదావరి నదినుంచి తీసుకువచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయ ప్రాంగణాన్ని, పరసర ప్రాంతాలను శుభ్రపరుచుకుంటారు. ఆ తరువాత ప్రత్యేక భాజాభజంత్రీలతో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.
ఇక్కడి పూజా కార్యక్రమం చాలా ప్రత్యేకంగా వుంటుంది. పూజ సమయంలో మొలకెత్తిన నవధన్యాలను, రాగి చెంబులో కొంచెం పాలను తీసుకుంటారు. ఆ తరువాత ఈ రెండింటిని ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపై వుంచుతారు. అలా వుంచిన ఆ రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే... పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మరికొన్ని విషయాలు :
పుష్య అమావాస్యరోజు ప్రపంచమంతా నలుపురంగుతో కప్పుకుంటుంది. ఆ సమయంలో ఆదివాసులు నాగదేవునికి నిష్టగా దీపారాధన చేసి పూజలు నిర్వహిస్తారు.... గంగాజలంతో అభిషేకిస్తారు. మూడురోజులపాటు కన్నులపండగగా నిర్వహించుకుంటారు. దీనినే నాగోబా జాతర అంటారు.
మెస్రం వంశస్థుల్లో కొత్తగా పెళ్లి అవుతున్న వధువులను తప్పకుండా ఈ నాగోబా దేవుని వద్దకు తీసుకువెళతారు. పెళ్లి కావలసిన అమ్మాయి చేత మొదటగా ఈ దేవునికి పూజ చేయించి... ఆ తరువాత వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్ వాల్’ అంటారు.
ఎప్పటివరకైతే మెస్రం వంశానికి చెందిన వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదే.. అప్పటివరకు వారికి నాగోబా దేవుడ్ని చూడటం కాని, పూజలు నిర్వహించడం కాని నిషేధం.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more