‘‘ఉపవాసం’’ అనేది... మనం ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరవ్వడమే కాకుండా.. మనం ఆరోగ్యంగా వుండేందుకు సహకరిస్తుంది. సాధారణంగా ఉపవాసంలో రోజంతా ఎటువంటి ఘనపదార్థాలుగానీ, ద్రవపదార్థాలుగానీ తీసుకోకుండా వుంటారు.
హిందూ ధర్మంలో అనేక రకాలైన ఉపవాసాలు వుంటాయి. ఒక్కొక్క ఉపవాసానికి ఒక్కొక్క ధర్మానుసారంగా పాటించాల్సి వుంటుంది. అందులో భాగంగానే కార్తీకమాసం ఉపవాసం చాలా ప్రాధన్యమైంది.
ఈ ఉపవాసంలో కొందరు పగలంతా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా, సూర్యాస్తమయం అయిన తరువాత భోజనం చేస్తుంటారు. ఇలా ఉపవాసం వుండడం వల్ల మనిషి ఆరోగ్యకరంగా, ఉత్సాహంగా వుంటాడని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు.
కార్తీకమాసంలో చలి చాలా ఎక్కువగా వుంటుంది. ఇటువంటి సమయాల్లో మన జీర్ణక్రియ కూడా కొంతవరకు మందగిస్తుంది. అటువంటి సమయాల్లో ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఉపవాసం... రకాలు...
ఉపవాసం వున్నవాళ్లలో కొందరు నీరు కూడా తాగకుండా కఠినంగా వుంటారు. మరికొందరైతే ఒక పూట భోజనం చేసి ఆ తరువాత ఏమీ తినకుండా ఉపవాసం వుంటారు. అలాగే మరికొందరు.. కేవలం ఒక్క పూట మాత్రం భోజనం తీసుకుని, ఆ తరువాత పండ్లు, పాలు వంటి వాటిని తీసుకుంటారు. ఇందులో చాలామంది మూడోపద్ధతికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
ఎందుకంటే.. కేవలం ఒక్కపూట భోజనం చేసి, మిగతా సమయాల్లో ఏమీ తీసుకోకపోతే మనిషి నీరసించిపోతాడు. దాంతో దేవుడి పేరు మీద చేసే ధ్యానం ఏకాగ్రతను కోల్పోతాడు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలావరకు శాస్త్రజ్ఞులు కూడా మూడో పద్ధతికే మగ్గు చూపుతున్నారు.
ఉపవాసం... పద్ధతి...
సహజంగా మనం రోజువారీ తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యపరిస్థితి ఆధారపడి వుంటుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ ఆహారం తీసుకోవడంగానీ, లేదా తక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. కొందరు భగవంతుని సేవలో నిత్యం ఉపవాసం వుంటారు.
అటువంటివారు చాలావరకు మితహారానికే ఎక్కువ అలవాటుపడతారు కాబట్టి వారి శరీరం, మనస్సు అదుపులోనే వుంటుంది. ఉపవాసం వున్నవారు.. వారు తీసుకునే ఆహార పద్ధతుల్ని మూడు రకాలుగా విభజించుకుంటారు. అవి మితాహారం, క్రమాహారం, సాత్వికాహారం.
మితాహారం : అంటే.. ఏదిపడితే అది, ఎక్కడబడితే అక్కడ, ఎంత కావాలంటే అంతా తినకుండా వుండడం. శాస్త్రీయపరంగా చెప్పాలంటే.. కడుపులో వున్న సగభాగాన్ని భోజనంతోనూ, ఆ మిగిలిన సగభాగంలో కొంత భాగం ద్రవపదార్థాలతోను, అందులో మిగిలిన కొంత భాగాన్ని ఖాళీగా వుంచుకోవాలి. దీనినే ‘‘మితాహారం’’ అంటారు. ఈ పద్ధతి వల్ల మనం భగవంతున్ని పూజ చేసేటప్పుడు మన ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్ధగా నిర్వహించుకోవచ్చు.
క్రమాహారం : ప్రతిరోజూ ఒకే సమయానికి పరిమితంగా, సమానంగా ఆహారం తీసుకోవడాన్ని క్రమాహారం అంటారు. దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా వున్నాయని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అదెలా అంటే.. మనం ప్రతిరోజు ఏదైనా ఒక సమయాన్ని కేటాయించి, ఆ సమయంలో ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మానసికంగానే కాకుండా శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా వుండవచ్చు. ఇక సాత్వికాహారంలో కూడా ఇలాగే లాభాలను చేకూర్చుతుంది.
ఉపవాసం.. సమయాలు...
ముందుగా మనం అనుకున్నట్లుగానే తమతమ దైవారాధనకు సంబంధించి, కొందరు తమకిష్టమైన విధంగా ఉపవాసాలను నిర్వహించుకుంటారు. వైకుంఠ ఏకాదశి, శివరాత్రుల్లో చాలామంది ఉపవాసం వుంటారు. అలాగే శ్రీరామనవమి నవరాత్రల్లో, దసరా రోజుల్లో నిర్వహించే దేవీ నవరాత్రులప్పుడు కూడా ఉపవాసాలు వుండి భగవంతునికి పూజలు నిర్వహించుకుంటారు. మరికొందరైతే తమ భవిష్యత్ బాగుండాలని, లేదా తమ కుటుంబం సుఖంగా వుండాలని, ఇంకా ఇతరత్ర ప్రయోజనాల కోసం ఆధ్యాత్మికంగా వారానికొకసారి ఉపవాసం వుండడం ఇష్టపడతారు.
ఆదివారం : సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు ఎక్కువమంది ఆదివారం రోజునాడు ఉపవాసం వుంటారు. కంటి, చర్మ సమస్యలతో బాధపడేవారు సూర్యుడిని పూజిస్తే మంచి ఫలితం పొందవచ్చుని చాలామంది విశ్వసిస్తారు. ఆదివారం ఉపవాసం వున్నవారు సూర్యాస్తమయంలోపు ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. ఆ తరువాత ఏమీ తీసుకోరు. తదనానంతరం సూర్యుడిని పూజించికుని, ఆయనకు సంబంధించిన కథలు వినడంగానీ, చదవడంగానీ చేసి దీక్ష విరమించుకుంటారు.
సోమవారం : శివపార్వతులు ఆదర్శవంతమైన దాంపత్యానికి ప్రత్యక్ష తార్కాణం. అందువల్ల ఆదర్శ దాంపత్య జీవనాన్ని కోరుకునే, తమ జీవితంలో మంచి భాగస్వామితో పెళ్లి చేసుకోవాలనుకునేవారు సోమవారం రోజు శివపార్వతులని పూజించి ఉపవాసం వుంటారు. వీరు కూడా కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు.
మంగళవారం : నవగ్రహాలరీత్యా మంగళవారానికి కుజుడు అధిపతి. జాతకరీత్యా కుజదోషం వున్నవారు 12 మంగళవారాలు ఉపవాసం వుండి, హనుమంతుడిని పూజించుకోవాలి. వీరు రోజుకి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవడం మంచిది.
బుధవారం : బుధవారానికి అధిపతి బుధుడు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించుకుని, ఆకుకూరలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. పెసలు, దుస్తులు దానంగా ఇస్తే మరీ మంచింది.
గురువారం : జ్ఞానశక్తిని పెంపొందించడానికి ఈరోజు చాలామంది ఉపవాసం వుంటారు. ఈరోజు గురువుని పూజించుకుని ఒక పూట భోజనం చేయాలి. పసుపు, బియ్యం, పప్పు వంటివి దానం చేస్తే మంచిది.
శుక్రవారం : లక్ష్మీ అనుగ్రహం పొందాలనుకునేవారు చాలామంది ఈరోజు ఉపవాసం వుంటారు. ఈ రోజుకి శుక్రుడు అధిపతి. కటిక ఉపవాసం వుండానుకునేవారికి ఈరోజు ఎంతో అనుకూలమైనది. లేదా ఒకపూట భోజనం చేయాలనుకునేవారికి పాయసం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈరోజు ఎవ్వరికీ దానం చెయ్యకూడదు.
శనివారం : శనివారానికి శని అధిపతి. శనికి పూజ చేసిన తరువాత హారతి ఇచ్చి.... నల్లటి దుస్తులు లేదా చెప్పులు దానం చేయాలి.
ఇలా ఉపవాసాలను నిర్వహించుకోవడంలో దైవారాధన పెరగడమే కాకుండా, ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో చలికాలంలోనే తీసుకునే అయ్యప్ప దీక్షలలో కూడా ఉపవాసం కలిసివుండడం ఇక్కడ గమనించదగిన విషయం.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more