ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఈ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన వెలిసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలందుకుంటున్న ఈ దేవాలయం గురించి...
ఆలయ చరిత్ర
క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.
ఆలయ స్థల పురాణం
అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.
ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.
(And get your daily news straight to your inbox)
Apr 21 | ఉత్తిష్ఠాన్నవరాధీశ! ఉత్తిష్ఠ వ్రతమోదిత! ఉత్తిష్ఠోత్తిష్ఠ విశ్వేశ! సత్యదేవ! దయనిధే! బ్రహ్మే ముహూర్త ఉత్థాయ - కరిష్యంతి తవ వ్రతం! సత్యవ్రతానుమోర్థం - ఉత్తిష్ఠోత్తిష్ఠ సత్వరమ్. ఉత్తిష్ఠ నిర్గుణాకార - భక్తానాం పాలనం... Read more
Apr 19 | కౌసల్యా సుప్రజా రామ! పూర్వాసంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ట నరశార్ధూల! కర్తవ్యం దైవమాహ్నికమ్ ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద! ఉత్తిష్ఠ గరుడద్వజ! ఉత్తిష్ఠ కమలా కాన్త! త్రైలోక్యం మంగళం కురు! యాదాద్రి నాఢ శుభమందిర కల్పవల్లి పద్మాలయే! జనని!... Read more
Apr 17 | 1. శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో! సుగ్రీవమిత్ర! ధనుజాంతక! వాయుసూనో! లోకైక వీర! పురపాల! గదాప్తపాణే! వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్ 2. ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్థం దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్,... Read more
Apr 10 | 1. శ్రీ జాని రద్రితనయాపతి రబ్జగర్భ: సర్వేచదైవతగణా: సమహర్షయో మీ ఏతేచ భూతనిచయా: సముదీరయన్తి గాయత్రి! లోకవినుతే! తవ సుప్రభాతమ్ 2. పుష్పోచ్చయప్రవిలసత్కరకంజయుగ్మా: గంగాదిదివ్యతటినీవరతీరదేశే ష్వర్ఘ్యం సమర్పయితు మత్ర జనా స్తవైతే ... Read more
Apr 04 | 1. శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే 2. శ్రీకరా! శుభకర! దేవ! శ్రీ గణేశ !... Read more