భారతీయ రిజర్వు బ్యాంకు నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో స్వల్పంగా లాభాలను అర్పించుకున్న తరువాత కూడా వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను అర్జించాయి. అర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేపథ్యంలో వడ్డీ రేట్లను అర్బీఐ తగ్గించదని.. పెరుగుతున్న ద్రవ్యోల్భణం నేపథ్యంలో యథాతధంగా కొనసాగిస్తుందన్న విశ్లేషకుల అంచానాల మేరకు ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లో ఉరకలు వేశాయి. సమీక్ష ఫ్రకటనను పరిగణలోకి తీసుకున్న మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు జోరందుకున్నాయి.
ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా లాభాలను అందుకున్నాయి. అయితే మదుపరులు అంచనాలకు తగ్గట్టుగానే అర్బీఐ కూడా వడ్డీ రేట్లను యథాతథంగా వుంచుతూ నిర్ణయం తీసుకోవడంతో.. ఆ ప్రభావం స్వల్పంగా లాభాలపై పడింది. 23 పాయింట్ల స్వల్ప లాభంతో 31,520 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్.. కొనుగోళ్ల మద్దతుతో మధ్యాహ్నానికి భారీ లాభాల దిశగా దూసుకెళ్లింది. ఒకానొక దశలో 200 పాయింట్లకు పైగా ఎగబాకింది.
అయితే ఆర్బీఐ నిర్ణయం తర్వాత కాస్త నెమ్మదించిన సూచీ.. చివరకు 174 పాయింట్లు లాభపడి 31,672 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 55 పాయింట్ల లాభంతో 9,915 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 65.00గా కొనసాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ , హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు అత్యధిక లాభపడగా.. భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more