వైట్ హౌజ్ ఎఫెక్ట్: వరుసగా ఐదవరోజు నష్టాల్లో మార్కెట్లు.. Sensex closes down 156 points amid US election jitters

Sensex closes down 156 points amid us election jitters

Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

BSE Sensex closed lower by 156.13 points, or 0.57%, to 27,274.15; Nifty 50 of the NSE ended lower by 51.20 points, or 0.60%, to 8433.75

వైట్ హౌజ్ ఎఫెక్ట్: వరుసగా ఐదవరోజు నష్టాల్లో మార్కెట్లు..

Posted: 11/04/2016 07:30 PM IST
Sensex closes down 156 points amid us election jitters

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదవ రోజు నష్టాలలో కూరుకుపోయాయి. అగ్రరాజ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో అభ్యర్థుల మధ్య రసవత్తర పోటీ నెలకోనడంతో..ఎవరు గెలుస్తారు..? వారు తీసుకునే నిర్ణయాలేంటి.. వాటి ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఎలా వుండబోతుంది..? అన్న అంచానాలతో అచితూచి అడుగువేస్తున్న మదుపరులతో వారంతంలో కూడా మార్కెట్లు నష్టాల బాటలోనే పయనించాయి. మొత్తంగా ఈ వారం మార్కెట్లుకు అసలు కలసిరాలేదు. ఒకవైపు ఫెడ్ వడ్డీ రేట్లను యధతథంగా కోనసాగించినా.. గ్లోబల్ మార్కెట్లు ఎక్కడా పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు.

మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించవచ్చునన్న కథనాలు మార్కెట్లను కోలుకోని దెబ్బతీస్తున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారన్న వార్తలతో స్థిరంగా కదిలిన మార్కెట్లు ఒక్కసారిగా కుదుపులకు గురయ్యారు. తాజా సర్వేలో డొనాల్డ్‌ ట్రంప్‌- హిల్లరీ క్లింటన్ ల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ రసవత్తరంగా సాగుతున్న క్రమంలో మదుపరులు అచితూచి అడుగులేశారు. ఫలితంగా వీటి ప్రభావంతో అమెరికా సహా ఆసియా వరకూ అన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లు ప్రభావితం అవుతన్నాయి.

ఉదయం మార్కట్లు ప్రారంభం నుంచి దేశీయ సూచీలు నష్టల బాటలో పయనించాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే నిన్నటి క్లోజింగ్ తో పోల్చగా సెన్సెక్స్ 70 పాయింట్ల వరకు నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ సాగించాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ ఏకంగా 156 పాయింట్లు నష్టపోయి 27 వేల 274 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 51 పాయింట్లకు పైగా నష్టపోయి 8వేల 434 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8450 మార్కుకు దిగువకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో ఎఫ్ఎంజీసీ సూచీ షేర్లు అధిక లాభాలను అర్జించగా, ఐటీ, టెక్నాలజీ షేర్లు కూడా స్వల్పంగా లాభాల్లో దూసుకెళ్లాయి. హెల్త్ కేర్, మధ్య తరహా, మధ్య తరహా నిఫ్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, అటో రంగ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మిగిలిన అన్ని రంగాల సూచీలు నెలచూపులు చూశాయి. ఈ క్రమంలో హెచ్ సీ ఎల్ టెక్, ఐటీసీ, టాటా మోటార్స్ డీజిల్, విప్రో, హెచ్ యు ఎల్ తదితర సంస్థల సూచీలు అధిక లాభాలను ఆర్జించగా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మ, భారతి ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles