దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టాలబాటలోనే సాగాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు మదుపుదారుల అచితూచి అడుగులు వేయడం కారణంగా మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి. దీంతో దేశీయ సూచీలు నాలుగు నెలల కనిష్ట స్థాయిని తాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్య పరపతి సమీక్షలో భాగంగా వడ్డీరేట్లను యధాతథంగానే కోనసాగించినా.. మార్కెట్లు మాత్రం తిరోగమనం పయనాన్ని వీడలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోరులో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించవచ్చునన్న ఊహాగానాల ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారన్న వార్తలతో స్థిరంగా కదిలిన మార్కెట్లు ఒక్కసారిగా కుదుపులకు గురయ్యారు. తాజా సర్వేలో డొనాల్డ్ ట్రంప్- హిల్లరీ క్లింటన్ ల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ రసవత్తరంగా సాగుతున్న క్రమంలో మదుపరులు అచితూచి అడుగులేశారు. ఫలితంగా వీటి ప్రభావంతో అమెరికా సహా ఆసియా వరకూ అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ప్రభావితం అవుతన్నాయి.
విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలు ఉదయం మార్కట్లు ప్రారంభం నుంచి నష్టలలోనే పయనించాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ ఏకంగా 97 పాయింట్లు నష్టపోయి 27 వేల 430 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 29 పాయింట్లకు పైగా నష్టపోయి 8వేల 485 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8500 మార్కుకు దిగువకు చేరుకుంది. ఈ తరుణంలో ఇవాళ మొత్తంగా 1775 సంస్థల షేర్లు నష్టాలను చవిచూడగా, 1174 సంస్థల షేర్లు లాభాలను అందుకున్నాయి. 125 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ గ్యాస్, మధ్య తరహా, మధ్య తరహా నిఫ్టీ, హెల్త్ కేర్, పీఎస్ యూ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా ఐటీ, బ్యాంకింగ్, అటో, క్యాపిటల్ గూడ్స్, సహా అన్ని సూచీలు నెలచూపులు చూశాయి. బీఎస్ఈ ఎఫ్ఎంజీసీ సూచీ మాత్రమే పదకోండు పాయింట్ల మేర లాభాలను అర్జించింది. ఈ క్రమంలో హిండాల్కో, భారతి ఇన్ఫ్రాటెల్, హీరో మోటో కాప్, ఎషీసీ, ఐటీసీ తదితర సంస్థల సూచీలు అధిక లాభాలను గ్రహించగా, అదాని పోర్ట్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, అరబిందో ఫార్మా, బిపిసిఎల్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more