ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పవనాలు వీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రభావంతో మార్కెట్లు తిరోగమనం దిశగా పయనించాయి. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చేసింది. దీంతో ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచే మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీని ఫలితంగా సెన్సెక్స్ రెండు వారాల కనిష్టస్థాయికి చేరగా, అటు నిఫ్టీ ఏకంగా మూడు మాసాల కనిష్ట స్థాయికి చేరింది.
విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కట్లు ఉదయం నుంచి నష్టలలోనే పయనించాయి. సెన్సెక్స్ 265 పాయింట్లకు పైగా నష్టంలో, నిఫ్టీ 87 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడింగ్ సాగించాయి. ఉదయం ప్రారంభంలో నిన్నటి క్లోజింగ్ తో పోల్చిగా, 265 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 87 పాయింట్లను నష్టపోయింది. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ ఏకంగా 349 పాయింట్లు నష్టపోయి 27 వేల 527 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 112 పాయింట్లకు పైగా నష్టపోయి 8వేల 514 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 6550 మార్కుకు దిగువకు చేరుకుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోరు కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. నిన్నటి వరకు డొమెక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ ఆధిక్యంలో ఉండగా, తాజా సర్వేలో అనూహ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందుకు దూసుకువచ్చారు. దాదాపు 1-2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల అమ్మకాలతో అమెరికా సహా ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వాల్ స్ట్రీట్ 4 నెలల కనిష్టం వద్ద ముగిసింది. చైనా షాంఘై o.6శాతం ఆసియా పసిఫిక్ 0. 4 శాతం, జపాన్ నిక్కి 1.1 శాతం నష్టపోయింది.
ఈ నేపథ్యంలో పీఎస్ యూ, ఆయిల్ అండ్ గ్యాస్,రియల్టీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ప్రభుత్వ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఓన్ జీసీ, ఎస్ బీఐ, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం లాంటి దిగ్గజాలు నేల చూపులు చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్ లో పీఎన్బీ, ఓబీసీ, బీవోఐ, కెనరా, ఐడీబీఐ, బీవోబీ, సిండికేట్, స్టేట్బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, యూనియన్, అలహాబాద్ బ్యాంక్ 4-3 శాతం మధ్య క్షీణించాయి.
ఈ క్రమంలో అన్ని రకాల సూచీలు భారీ కుదుపులకు గురయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ, మెటల్స్, టెక్నాలజీ మినహా అన్ని రంగాల సూచీలు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. మహింద్రా అండ్ మహీంద్రా, భారతి ఇన్ ఫ్రా టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్ యు ఎల్ తదితర సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ (డీ), బ్యాంక్ అప్ బరోడా, టాటా మోటార్స్, బిహెచ్ఇఎల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more