స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టినా.. పూర్తి స్థాయిలో తన సత్తాచాటుకునేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఎల్జీ వినూత్న తరహాలో పరిశోధనలు చేసిన సరికోత్త స్మార్ట్ ఫోన్ ను అభిమానుల కోసం తీసుకువచచింది. ఇప్పటి వరకు డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరాలకు ప్రాధన్యం ఇచ్చిన కస్టమర్లను ఇక డ్యూయల్ డిస్ప్లే వైపు అకర్షించేందుకు ఎల్జీ ఈ నూతన స్మార్ట్ పోన్ ను అందుబాటులోకి తెనుంది. ఎల్జీ ఎక్స్ స్క్రీన్ పేరుతో డ్యూయల్ డిస్ప్లే ఫోన్ను రిలీజ్ చేస్తోంది. ఈ ఫోన్ను ఈ నెల 18న భారత మార్కెట్లో విడుదల చేస్తున్నామని, బడ్జెట్ ఫోన్గా ఉండేలా ధరను నిర్ణయిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఆఫరింగ్లో తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి డ్యూయల్ డిస్ప్లే ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ డ్యూయల్ డిస్ప్లే ఫోన్ ద్వారా నోటిఫికేషన్లను చూసుకోవడాని వేరే ప్రోగ్రామ్ను ఆపాల్సిన అవసరం ఉండదు. బ్రౌజర్లో వర్క్ చేసుకుంటూనే వాట్సప్, ఫేస్బుక్ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఒకేసారి రెండు ప్రోగ్రామ్స్పై వర్క్ చేసుకోవచ్చు. ఇటీవలే కే సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ఎల్జీ మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రెండో స్క్రీన్ ఎల్లప్పుడూ ఆన్లో ఉండేలా ఈ ఫోన్ రూపొందింది. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా వెంటనే రెండో డిస్ప్లేలో నోటిఫికేషన్లను చూసుకోవచ్చు.
ఎల్ జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు..
4.93 హెచ్డీ మెయిన్ డిస్ప్లే
520 x 80 పిక్సెల్స్ రెజల్యూషన్ గల 1.76 అంగుళాల సెకెండరీ డిస్ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
7.1 ఎంఎం థిక్
120 గ్రాముల బరువు
13 ఎంపీ బ్యాక్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2300 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more