అధికార దుర్వినియోగానికి ఇది మరో సాక్ష్యం. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నావల్ ఎయిర్ బేస్, ఢిపెన్స్ ఎస్టాబ్లిష్ మెంట్ల పరిధిలోకి వచ్చే గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకంగా పార్టీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇతరులెవరైనా వారి తరహాలోనే వ్యవహరించి వుంటే వారిపై మోయలేనన్ని కేసులు నమోదు చేసి.. వారు చేసింది చిన్న తప్పిందం కాదని కూడా నమ్మబలికేవారు. కట్టుదిట్టమైన భద్రతావలయంలో వుండాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయంలో.. నిత్యం నిఘానేత్రాల పర్యవేక్షణ మధ్య వుండే చోట ఎవరైనా మీటింగ్ లు పెడతారా..? అని ఎదురు ప్రశ్నించేవారు.
సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగజేస్తూ ఇలా సమావేశాన్ని నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించేవారు..? ఇదెక్కడి చోద్యం అంటూ గగ్గోలు పెట్టేవారు. అందుకనే వారిపై కేసులు నమోదు చేశామని, ఇలాంటి తప్పులు ఎవరు చేసినా వారు శిక్షార్హులేనన్న విషయాన్ని మరింతగా నొక్కి చెప్పేవారు. కానీ కుడితిలో పడిన ఎలుక మాదిరిగా అయ్యింది కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార పక్షం పరిస్థితి. ఎందుకంటే ఆ మీటింగ్ ను నిర్వహించింది వారే కాబట్టి. అయితే దీనిని విపక్షాలకన్నా ముందుగానే ఓ న్యాయవాది, సామాజిక కార్యకర్త ఎయిరెస్ రోడ్రిగ్స్ తీవ్రంగా పరిగణించారు.
అమిత్ షా తో పాటుగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, గోవా బీజేపి అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్, కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ లపై కూడా కేసు నమోదు చేయాలని రోడ్రిగ్స్.. గోవా చీఫ్ సెక్రటరీ, డీజీపీ, విమానయాన శాఖలను కోరారు. గోవాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సమావేశం నిర్వహించడం నిబంధనలు అతిక్రమించడమేనని ఆయన తన పిర్యాదులో పేర్కోన్నారు. అయితే ఈ పెద్దలందరూ తమకు ఈ విషయం తెలియదని తెలివిగా తప్పించుకునే అవకాశాలు కూడా వున్నాయని, అయినా వారిపై కేసులు నమోదు చేయాలని రోడ్రిగ్స్ కోరారు.
దీనిని తమకు అందించ్చిన అవకాశంగా తీసుకుంది గోవా కాంగ్రెస్. అమిత్ షాను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై విమానాశ్రయ డైరెక్టర్ ను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించగా, తాను అనుమతినివ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు కేటాయించిన సీటులో తనను కూర్చోనివ్వకుండా అక్కడి అధికారి అడ్డుకోండంతో కోపోద్రిక్తుడైన శివసేన ఎంపీపై ఏకంగా ట్రావెల్ బ్యాన్ విధించి.. ముప్పుతిప్పలు పెట్టిన విమానయానశాఖ.. అధికారపక్షానికి చెందిన నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఎందుకు స్పందించరన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
విపక్షాలతో పాటు తమను నిత్యం ఇబ్బందిపెట్టే మిత్రపక్షాలను సైతం విడువకుండా చిన్న అంశాన్ని గోరంత చేసి రంద్రాన్వేషణ చేసే అధికార పక్షం.. అమిత్ షా మీటింగ్ పై ఎందుకు నేరుగా స్పందించడం లేదు.? అసలు దీనిపై మాట మాత్రమైనా అమిత్ షా స్పందించడం లేదంటే అయన చేసింది తప్పు అన్న విషయాన్ని అంగీకరిస్తున్నట్లేనా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. అమిత్ సా సహా గోవాలోని అదికార పక్షం తప్పిందాన్ని అంగీకరిస్తారా..? లేక సమర్ధించుకుంటారా..? అలా అయితే వారు చెప్పే సూక్తులు అన్ని కేవలం ప్రజలకేనా..? ఇదేమి చోద్యం.. చెప్పేదోకటి, చేసేదోకటి అన్న విమర్శలకు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more