తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారాన్ని కాపాడుకునే యత్నంలో చేయకూడని పనులు చేశారా..? అంటే అవుననే సమాధానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు గాను తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విశ్వాస పరీక్ష జరిగిన తీరు సక్రమంగా లేదని.. దీనిని రద్దు చేయాలని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించింది.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు సమ్మతిని ఇచ్చింది. ఈ క్రమంలో పళని స్వామి ప్రభుత్వం అధికారాన్ని కాపాడుకునే యత్నంలో చేసిన పాపపు పనులు తెరమీదకు వస్తాయా..? అన్న ప్రశ్న సర్వత్రా వినబడుతుంది. బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున బంగారం, డబ్బును పంచినట్టు ఇటీవలే ఓ స్టింగ్ ఆపరేషన్ కూడా వెలుగుచూడటంతో ఇక పళని స్వామి ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు వచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే మూడు ముక్కలుగా చీలిపోయిన అధికార అన్నాడీఎంకే పార్టీలో పళనిస్వామి వర్గం.. ఆది నుంచి మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నుంచి అటు విమర్శలను, ఇటు అరోపణలనుఎదుర్కోంటునే వుంది. కాగా వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి అటు కేంద్రంలోని అగ్రనేతలు తెరవనుకగా సాగించిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పన్నీరు సెల్వం ఏకంగా పళనిస్వామిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర పర్యటన కూడా చేశారు. తన పర్యటనలో అమ్మకు అసలైన వారసుడిని తానేనంటూ ప్రజల్లోకి వెళ్లారు.
అయితే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని.. పళనిస్వామి సర్కార్ ను గద్దె దింపితే.. మళ్లీ ఎన్నికలు వస్తాయని ఈ క్రమంలో తాము అధికారంలోకి ఎలాంటి ప్రయాస లేకుండా రావచ్చని భావిస్తుంది. దీంతో స్టింగ్ అపరేషన్ వెలుగుచూడగానే పళిని స్వామి ప్రభుత్వంపై ఏకంగా న్యాయపోరాటానికి సిద్దమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేసింది.
పళనిస్వామి అధికారాన్ని కాపాడుకునే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని, నిజానిజాలను న్యాయస్థానం విచారణలో వెలుగులోకి తీసుకురావాలని పిటీషన్లో పేర్కోన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 4 కోట్లు ఇచ్చేందుకు కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సిద్ధపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా తాజాగా న్యాయస్థానం తమిళనాడులో విశ్వాస పరీక్ష నిర్వహించిన క్రమాన్ని పరిశీలించేందుకు అనుమతిని ఇవ్వడంతో.. త్వరలోనే నిజాలు వెలుగుచూస్తాయని అరవ రాష్ట్ర ప్రజలు, అమ్మ అభిమానులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more