తెలంగాణలో అభివృద్ధి సంగతి పక్కనపెడితే ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్న విషయం మొన్నే చెప్పుకున్నాం. ముఖ్యంగా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో వాళ్లు వెలగబెడుతున్న వ్యవహారాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తుండటంతో వాళ్లపై రిపోర్టులు తెప్పించేసుకున్నాడు గులాబీ బాస్. ఓ జాతీయ మీడియా వాటిని సీక్రెట్ గా తెప్పించేసుకుని ప్రచురించటంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మొత్తం 119 ఎమ్మెల్యేలలో కేవలం 15 మంది మాత్రమే తమకు కేటాయించిన నిధులను సవ్వంగా వినియోగిస్తున్నారని దాని సారాంశం. నిజానికి కేటాయింపుల్లో కనీసం 60 నుంచి 70 శాతం ఖచ్ఛితంగా నియోజక వర్గాల అభివృద్ధి పథకం(సీడీపీ) కింద ఖర్చు చేస్తేనే అది లెక్కల్లోకి వస్తుంది. కానీ, ఇక్కడ అది మచ్చుకైనా జరగటం లేదు. 65 మంది ఎమ్మెల్యేలు 50 నుంచి 75 శాతం, 37 మంది 25-50 శాతం మాత్రమే వినియోగిస్తున్నారు.
ఇక నివేదిక ప్రకారం చూసుకుంటే.. సీఎ కేసీఆర్ తన ఎమ్మెల్యే నిధుల్లో 50 శాతం కంటే తక్కువగానే ఖర్చు చేయగా, తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ 25 శాతం కంటే తక్కువగా ఖర్చు చేశాడు. ప్రతిపక్ష నేత జానా రెడ్డి, టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, బీజేపీ కిషన్ రెడ్డి లక్ష్మణ్ లు, చివరకు అసలు అభివృద్ధే చేయటం లేదని స్వయంగా కేటీఆర్ విమర్శలు గుప్పించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీలు కూడా 75 శాతం కంటే ఎక్కువే ఖర్చు పెడుతున్నారు.
టీఆర్ఎస్ తరపున అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఒక్కడే 75 శాతం పైగా నిధులను ఖర్చుపెట్టినట్లు ఉంది. 25 శాతం కంటే తక్కువ చేసిన వాళ్లలో కేటీఆర్ తోపాటు కొండా సురేఖ, దాస్యం వినయ భాస్కర్, మరియు గణేష్ లు ముగ్గురు టీఆర్ ఎస్ కు చెందిన వారే కావటం గమనార్హం. 2015-16 కు గానూ ఒక్కో ఎమ్మెల్యేకు 1.50 కోట్లు నిధులను కేటాయించగా, 2016-17 కు 3 కోట్లు, ఇక ఈ యేడాదిలో ఇప్పటిదాకా ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ కింద 75 లక్షలు సీడీపీ కింద కేటాయించారు.
ఇలా అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష నేతలే ముందంజలో ఉండటం ఒకరకంగా టీఆర్ ఎస్ కు ఇబ్బందికరమైన విషయమే. అయితే అధికార పక్షం నేతల వ్యవహరం(తనతోసహా)తో పెద్ద ఎత్తున్న నిధులు ఇలా మిగిలిపోతుండటంతో రంగంలోకి దిగిన కేసీఆర్ ఎంపీ నిధులకైతే ఎలా రియంబర్స్ మెంట్ విధానాన్ని అనుసరిస్తారో అలాంటి మార్గదర్శకాలను అవలంభించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే విమర్శలకు చెక్ పెట్టొచ్చనేది టీ సీఎం ప్లాన్.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more