వాహనదారులకు దేశీయ ఇంధన సంస్థలు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నాయా..? అంటే ఔను అన్న సంకేతాలే వినబడుతున్నాయి. కేంద్రంలోకి బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చన నాటి నుంచి అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు గణనీయంగా మారుతూ.. 180 డాలర్ల వరకు వెళ్లిన బ్యారెల్ చమురు ధర అమాంతంగా కిందకు దిగివచ్చింది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం తొలినాళ్లలో 50 నుంచి 60 రూపాయల మధ్య వున్న పెట్రోల్ ధరలు మళ్లీ కేంద్రం విధించిన పన్నుల భారం కారణంగా పైపైకి ఎగబాకాయి.
దీనికి తోడు అంతర్జాతీయంగా కూడా క్రూడ్ అయిల్ ధరలలో పెరుగుదల కూడా ఒకింత కారణమయ్యింది. అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో క్రూడాయిల్ ధర 50 డాలర్ల దిగువకు పడిపోయింది. దీంతో మన ఇంధన సంస్థలు కూడా భారీగా ధరలను తగ్గిస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలో ఉత్పత్తి పెరుగుతుండటంతో, పతనమవుతున్న ధరలకు కళ్లెం వేయాలంటే, ఒపెక్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వుంది. కాగా, ప్రస్తుతం మేలో డెలివరీ అయ్యే బ్యారల్ క్రూడాయిల్ ధర 49.71 డాలర్లుగా ఉంది. గత ఏడాది నవంబర్ 30 తరువాత ముడి చమురు ధర ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ ప్రభావంతో భారత క్రూడ్ బాస్కెట్ ధర కూడా తగ్గనుండటంతో పెట్రోలు, డీజెల్ ధరలు కూడా భారీగానే తగ్గనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
ఇకపోతూ ఇప్పటికే కేంద్రం గత రెండు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై విధిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీపై విమర్శలు వెలువుడుతున్నాయి. ఇందన ధరలు తక్కువ ధరలకు అందుబాటులో వుండాల్సి వున్నా.. కేంద్రం విధించిన పన్నుపోటు కారణంగానే వాటికి రెకకకటు వస్తున్నాయన్న విమర్శలు వున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా లీటర్ పెట్రోల్ 1.2 గా వున్న ఎక్సైజ్ డ్యూటీని 8.95 కు పెంచగా, లీటర్ డీజిల్ పై 1.46గా వున్న పన్నును 7.96 కు పెంచారని దీని ద్వారా ఏకంగా 1.99 లక్షల కోట్ల రూపాయల అదాయాన్ని రాబట్టరాని కాగ్ తన నివేదికలోనూ పేర్కోనింది. ఈ నేపథ్యంలో ఈ సారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశాలున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more