బీజేపి యువమోర్చ ఆ ముఖ్యమంత్రి పరువును తీసిందా..? దేశంలోనే అత్యంత కీలకమైన, అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన యోగీ అదిత్యనాథ్ విషయంలో బీజేపి యువమోర్చా నేతలు అత్యుత్సాహం పార్టీ పరువును బజారున పడేసిందా..? తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పరువును తీసుకున్నారా..? ఈ విషయంలో బీజేపీ యువమోర్చ నేతలు స్వయంకృతాపరార్థం వుందా..? లేక అనుకోకుండానే ప్రచారం పెరగడం.. పరువు మంటగలపడం జరిగిపోయాయా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
వామపక్షానికి చెందిన మహిళా నేత, మహిళా హక్కుల ఉద్యమకర్త ప్రభ ఎన్ బైలహొంగల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కు చెందిన అభ్యంతరకర ఫోటోలను తన ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో ఈ విషయమై బీజేపి యువమోర్చ నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అమె తమ ముఖ్యమంత్రికి చెందిన ఫోటో షాప్ చేసిన కల్పిత ఫోటోలను తన పేస్ బుక్ లో పెట్టి తప్పడు ప్రచారానికి తెర తీసారని బీజేపి నేతలు అరోపించారు. తక్షణం అమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపి యువమోర్చ నేతలు అమెపై పోలీసులకు కూడా పిర్యాదు చేశారు.
అమె సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో ప్రభ బైలంహొంగల పోస్టు చేసిన ఫోటోలలో.. ముఖ్యమంత్రి పదవి కన్నా ముందు అటు మఠాధిపతిగా ఇటు బీజేపి ఎంపీగా ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు చేరువైన ఆయన.. ఒక మహిళతో సన్నిహితంగా వున్నారంటూ.. వాటి తాలుకు ఫోటోలను తన పేస్ బుక్ పేజీపై అప్ లోడ్ చేశారు. దీంతో అమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాయచూరులోని సదర్ బజార్ పోలిస్ స్టేషన్ వద్ద కార్యకర్తలు అందోళనకు దిగి అమెపై పిర్యాదు చేశారు.
అయితే యోగి అదిత్యనాథ్ కు చెందిన అభ్యంతరకర పోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడంలో అవి నిజమేనా కాదా అంటూ పెద్ద సంఖ్యలో ఆ ఫోటోలను వీక్షించేందుకు నెట్ జనులు సర్చ్ చేసినట్లు సమాచారం. దీంతో యోగి అదిత్యనాథ్ పరువును పార్టీ నేతలే తీసారా..? అయన పరువును బజారు పాలు చేశారా..? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరికోందరు ప్రభ పోస్టు చేసిన ఫోటోలు నిజమైనవా..? కాదా..? అని విచారణ జరిపిన తరువాత అమెపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more