కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర విభజన విషయంలో ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తుంది. తాను అనుకున్నది సాధించుకునేందుకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎవరిమాట వినడం లేదు. సీడబ్య్లూసీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మాణం చేయించేసి, దానికి సంబంధించిన బిల్లు ప్రక్రియను కూడా పూర్తి చేసి రాత్రికి రాత్రే రాష్ట్రపతితో సంతకం చేయించి, నిర్ణీత గడువు 40 రోజులు విధించి ఆ లోగా తిరిగి పంపించాలని ఆదేశాలు జారీ చేయించి కాస్తంత టెన్షన్ ఫ్రీ అయిన కేంద్రం బుధవారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే మళ్లీ తెలంగాణ అంశంపై దృష్టి కేంద్రీకరించింది.
రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన బిల్లు చర్చ జరపకుండా లొల్లి లొల్లి చేస్తూ గడువును దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి పై అధినేత్రి గరం గరం అయినట్లు ఢిల్లీ పెద్దల సమాచారం. ఇచ్చిన గడువును పూర్తిగా ఉపయోగించుకుని, శాసనసభలో చర్చ పూర్తి చేస్తే సరేసరి! లేకుంటే మాత్రం లోక్సభలోనే బిల్లుకు తుది రూపు ఇవ్వాల్సి వుంటుందని గట్టిగా చెప్పినట్టు సమాచారం. ఇలాగే గందరగోళం కొనసాగుతూ, వాయిదాల మీద వాయిదాలు పడితే మాత్రం ఇక సహించేది లేదని, రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23 వరకూ కేంద్రం ఆగదని, దీనికి తుది రూపు లోక్ సభలో తీసుకురావాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం.
పార్లమెంట్లో లోక్పాల్ బిల్లు ఆమెదం పొందడంతో ఇక తరువాయి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైనే కేంద్రం దృష్టి సారించింది. అయితే... షిండే ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో మాట్లాడి, శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. ప్రస్తుతం అసెంబ్లీలో బిల్లు పై గోల జరుగుతుండటంతో ఇచ్చిన గడువు వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందా ? లేదా అనే దాని పై తర్జనలు భర్జనలు పడుతుంది. ఈ విషయం పై హోం మంత్రి షిండే సోనియాకు ప్రస్తుతం అసెంబ్లీలో బిల్లులో చర్చ జరగాల్సి ఉందని, ఆ ఘట్టం ముగిసిన తర్వాతే విభజనపై తదుపరి చర్యలు తీసుకోగలమని, బుధవారం నుంచి అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరగాల్సి ఉంది. కానీ... జరగలేదు. గురువారం, శుక్రవారం జరుగుతుందో లేదో కూడా చెప్పలేం.
తదుపరి విడత సమావేశాల్లోనూ చర్చ జరిపే పరిస్థితి లేకుంటే... ఇక మూడో విడతకు ఆస్కారం ఇవ్వకూడదని, తమ పని తాము చేసుకుపోవాలనే సూచించినట్లు తెలుస్తుంది. అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఇప్పుడు సాధ్యం కాదని, దీని కోసం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుందని, ఒకవేళ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తితే కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అవసరమైతే రాష్టపతి పాలన విధించాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. మరి అధినేత్రి హెచ్చరికతోనైనా సభలో చర్చ సవ్వంగా సాగేనా ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more