రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఓ ఆరు నెలల పాటు వాయిదా పడే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకులు శాసనసభను వదిలి లోక్ సభ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, 2014 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న ఆయన బావమరిది, సినీ నటుడు బాలక్రిష్ణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడితే... లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిది సంవత్సరాల నుండి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇప్పటి వరకు పార్లమెంటు తరుపున పోటీ చేయలేదు. చిత్తూరు జిల్లా కుప్పం నుండే ఇప్పటి వరకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో తన అక్ ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయకులు. హైదరాబాద్ నగర శివార్లలోని మల్కాజిగిరి లేదా అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఆయన పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం టీడీపీకి బలమైన స్థానంగా ప్రచారంలో ఉన్నా ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీ తరుపు నాయకుడే ఎంపీగా ఉన్నాడు.
చంద్రబాబు రంగంలోకి దిగితే టీడీపీ గాలి వీయడం ఖాయం అని, అందుకే మొదటి ఆప్షన్ గా మల్కాజిగిరినీ ఎన్నుకున్నాడని, అది కుదరకపోతే అనంతరం పురం జిల్లా హిందూపురం నుండి పోటీ చేయాలని భావిస్తున్నాడట. అక్కడ టీడీపీ, బీజేపీ కలిపి పోటీ చేస్తే అది కలిసి వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిసి జరిగినా, విడివిడిగా జరిగినా మంచిదే. ఈసారి గాలి ఎన్డీయే వైపు వీస్తుంది. అలా జరిగితే బాబుకు కలిసి వస్తుందని అని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలను అన్నింటిని చూస్తుంటే బాబు ఎలాగైనా లోక్ సభకు పోటీ చేసి గెలిచి, కేంద్రంలో కీలక బాధ్యతలు స్వీకరించి, ఇక్కడ శాసన సభకు లోకేష్ బాబును పోటీ చేయించి అక్కడ, ఇక్కడ చక్రం తిప్పాలనే వ్యూహంలో ఉన్నాడని అంటున్నారు. ఇక బావమరిది బాలక్రిష్ణకు కూడా సీమాంధ్ర ప్రాంతం నుండి టీడీపీకి పట్టున్న ప్రాంతం నుండి సీటు ఇప్పించి గెలిపించి, తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యథిక స్థానాలను గెలుచుకోవాలని
టీడీపీ వ్యూహమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more