రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు దారితీసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో సీమాంధ్ర, తెలంగాణా శాసనసభ్యుల మధ్య కీచులాట జరుగుతున్న నేపథ్యంలో కన్నా ఇక్కడ లేకపోగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యుపిఎ అధినేత్రి సోనియాగాంధీతో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ పూర్తికాగానే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారంలో ఉంది.
ఇటువంటిది జరిగితే ఆయన స్థానంలో కన్నా లక్ష్మీనారాయణను నియమించేందుకు అధిష్టానం ఆలోచన చేస్తోందని సమాచారం. కాంగ్రెస్ గ్రూపుల్లో మరో రకమైన చర్చ కూడా ఉంది. సీమాంధ్రకు పిసిసి అధ్యక్షునిగా కన్నాను నియమిస్తారని వీరు చెపుతున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల్లో సిఎం మార్పు సాధ్యాసాధ్యాలపై సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. గత నెలలోనూ కన్నా ఢిల్లీలో పర్యటించినప్పుడు ఇదే రకమైన ప్రచారం సాగింది. అయితే అపాయింట్మెంట్లు ఇచ్చేసరికి జాప్యం జరిగిందని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో చెప్పాయి.
వచ్చే ఏడాది మే నెలలో జరిగే ఎన్నికలకు మార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కేవలం మూడునెలల కోసం సిఎంను మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సిఎం కిరణ్కుమార్రెడ్డి విభజన విషయంలో అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తున్నందున ఆయనను పదవి నుంచి తప్పిస్తారని, మంత్రి కన్నాను కొద్దికాలమైనా సిఎం పదవి వరిస్తుందని ప్రచారం జరుగుతోంది. కన్నా నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్తుందని కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు వినవస్తున్నాయి.
అసెంబ్లీలో విభజన బిల్లు అంశం రసాభాసగామారి జనవరి 3వ తేదీకి నిరవధిక వాయిదాపడింది. 3న జరిగే సమావేశంలో సిఎం కిరణ్కుమార్రెడ్డి శాసనసభ రద్దు నిర్ణయం తీసుకుంటే గవర్నర్ ద్వారా రాజకీయం నడిపి ముఖ్యమంత్రిగా లేదా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కన్నాకు అవకాశం కల్పిస్తారని ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రస్తుత ముఖ్యమంత్రినే ఎన్నికలయ్యే వరకూ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారు. అయితే అధిష్టానాన్ని ధిక్కరించారు కాబట్టి కిరణ్కు అవకాశమివ్వకుండా కన్నాను నియమించే అవకాశముందని, ఇందుకోసం రాజ్యాంగపరమైన అడ్డంకులేమీ లేకుండా కాంగ్రెస్ చర్యలు చేపట్టవచ్చని ఆ పార్టీ గ్రూపుల్లో చర్చ నడుస్తోంది. అయితే కన్నాను పిలిపించుకుని మాట్లాడిన అధిష్టానం, మళ్లీ తాజాగా చర్చలు జరపడంలో ఆంతర్యమిదేనని మంత్రి అనుచరులు చెపుతున్నారు.
కాగా తుపాన్ల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం నిధుల కోసమే కన్నా ఢిల్లీ వెళ్లినట్లు మరో ప్రచారం సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున... అక్టోబర్లో భారీవర్షాలు, పైలిన్, హెలెన్, లెహర్ తుపాన్లకు నష్టపోయినవారికి పరిహారం ఇప్పించడం ద్వారా రాజకీయంగా పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే కన్నా ఢిల్లీ వెళ్లినట్లు ఇంకో ప్రచారమూ ఉంది. పంట నష్ట పరిహారం కోసం వెళితే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్పవార్ను కలవాలిగానీ సోనియాగాంధీని కలవడంలోని ఆంతర్యమేమిటని పలువురు సందేహం వ్యక్తంచేస్తున్నారు. పరిహారం పేరుతో రాష్ట్ర రాజకీయాల అంశంపై సోనియాతో చర్చించినట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. పదవీకాలం ముగిసే దశలో కొద్దినెలలైనా కన్నాకు సిఎం పీఠం ఎక్కే యోగముందో.. కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామానో.. అసెంబ్లీ సమావేశాలు ముగింపునాటికి తేటతెల్లమవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more
Dec 20 | ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా ’ అన్నట్లు... మన దర్శకధీరుడు రాజమౌళి తలుచుకుంటే తన సినిమాలో ఎంతమంది స్టార్లనైనా పెట్టుకొంటాడు. రాజమౌళి ప్రస్తుతం యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్గా దర్శకేంద్రుడు... Read more