రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని ఎదిరించినట్లు, సీమాంధ్రుల దగ్గర సమైక్యవాద కెప్టెన్ గా పేరు తెచ్చుకొని, తెలంగాణ వాదులకు బద్ద శత్రువుగా మిగిలిన ఆయన ఏ ఎండకు ఆ గొడుకు పడుతున్నాడు. ఆ మధ్య ‘తుఫాన్ ని ఆపలేక పోయినా విభజనను మాత్రం ఆపుతాం ’, ‘విభజన ఎలా జరుగుతుందో చూస్తాం ’ అంటూ అధిష్టానానికి సవాల్ విసిరిన కిరణ్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కళ్ళు, చెవులు లేని కబోధులు అని కూడా వ్యాఖ్యానించి, అధిష్టానాన్ని ఎదిరించే కిరణం అనే ముద్ర వేసుకోవడానికి నానా తంటాలు పడిన ఆయన తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చాక మౌనం దాల్చారు.
బిల్లుతో పాటే రాష్ట్రానికి వచ్చిన వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ తో రెండు రోజులు సమావేశాలు నిర్వహించిన అనంతరం కిరణ్ అధిష్టానానికి నమ్మకస్తుడిగా మారి పోయారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజునే అనారోగ్యం అనే సాకుతో డుమ్మా కొట్టిన ఆయన, సమైక్యవాదానికి మద్దతుగా ఒక్క మాటా బహిరంగంగా మాట్లాడలేదు. నేడు శాసన మండలిలో మాట్లాడిన కిరణ్ అక్కడ ఇరు ప్రాంతాల ఎమ్మెల్సీలను చల్లబరిచేందుకు నాలుగు తీపి మాటలు మాట్లాడి వారి ఆగ్రహానికి గురయ్యారు.
బిల్లు విషయంలో రాజ్యాంగబద్దంగా వున్న విషయాలను సభ్యులందరూ వినియోగించుకోవాలని, న్నితమైన అంశం పట్ల అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆయా చట్ట సభల్లో చర్చలు ఎలా జరిగాయో పరిశీలించాలనీ, ఆ తర్వాతే మన రాష్ట్ర చట్ట సభల్లోనూ విభజన బిల్లుపై చర్చించాల్సి వుంటుందనీ, ఎవరూ రెచ్చగొట్టేలా మాట్లాడుకోరాదనీ, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించగలిగేలా ఉండాలని అన్నారు. తీరా సమావేశాలు వాయిదా పడిన తరువాత మీడియాతో మాట్లాడుతూ...
తానేంటో అసెంబ్లీలో నిరూపిస్తానని, రాజకీయ తుఫానును అడ్డుకుంటానన్న మాటలకు ఇప్పటికీ తాను కట్టుబడే వున్నానని, నా నిజాయితీని ఎవరు శంకించనవసరంలేదని, నా ఆటలో చివరి బంతి ఆయిపోలేదని, తాను పోరాటయోథుడినని, చివరి వరకు పోరాడతానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కలిసి ఉండాలో లేదో శాసనసభ, మండలి సభ్యులే తేల్చాలని, సభలో ఇరు ప్రాంతాలను మెప్పించే విధంగా చర్చ జరిగిలా చూడాల్సిన అవసరం సభాపతుల పై ఉందని అన్నారు. కిరణ్ ఓ పై చిలక పలుకులు పలుకుతూనే... మరో వైపు తెలంగాణకు వత్తాసు పలికి అధిష్టానానికి దారులన్నీ క్లియర్ చేస్తున్నారని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more