ఈరోజు తెలంగాణ బిల్లును స్పీకర్ అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అయితే ప్రజా ప్రతినిధులు కాస్తా వీధి రౌడీలుగా మారిపోయారు. అసెంబ్లీ అట్టుడికి పోయింది. అసెంబ్లీ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. బిల్లు ప్రతులను చించివేయడం, కాల్చివేయడం. తోటి సభ్యులమీద తెలంగాణ సభ్యులు కుర్చీలు విసిరి వీరంగం సృష్టించారు. మొత్తానికి అసెంబ్లీ ప్రాంగణం ఉద్రిక్తపరిస్తితులతో దద్దరిల్లింది.
అసెంబ్లీ మరోసారి తన గౌరవాన్ని కోల్పోయింది. గౌరవ సభ్యులు అంటూ సంబోధించుకునేవాళ్లలో పలువురు దారుణంగా ప్రవర్తించారు. ఇంకా రాష్ట్రం సమైక్యంగా ఉండగానే.. తోటి సభ్యుల స్వేచ్ఛను అడ్డుకోడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. తెలంగాణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్లో మాట్లాడే సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు వారిని అడ్డుకోడానికి మీద మీదకు దూసుకొచ్చారు.
దీనికి తోడు బిల్లు యొక్క ఇంగ్లీష్ ప్రతులలో కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అని ఉండే చోట తమిళనాడు అని ప్రచురణ కావడం సీమాంధ్ర నేతలకు పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. దీంతో ఈ తప్పుల తడక బిల్లుని ఎలా ప్రవేశ పెడతారని మండిపడుతూ మీడియా పాయింట్లో మాట్లాడుతుండగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్వామిగౌడ్, మరికొందరు ఎమ్మెల్సీలు, కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు సీమాంధ్ర ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు.
చివరకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడికి ప్రయత్నించారు. కనీసం మీడియా పాయింట్లో కూడా మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వకుండా అత్యంత హీనంగా ప్రవర్తించారు. గండ్రను నలుగురైదుగురు పోలీసులు కలిసి వెనక్కి లాగేందుకు ప్రయత్నించినా ఆయన ఏమాత్రం ఆగకుండా ముందుముందుకు వెళ్లారు. చివరకు అక్కడ ఎవరు సభ్యులో, ఎవరు కాదో కూడా తెలియని పరిస్థితుల్లో దాడులు జరిగాయి.
సాక్షాత్తు మండలి ప్రాంగణంలో్నే సభ్యులమీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటే రేపు పరిస్థితి ఏంటని నన్నపనేని ధ్వజమెత్తారు. ఇక పోలీసులు కూడా ఇప్పటికే తెరాస అధికారంలో ఉన్నట్లుగా వాళ్ళకే పనిచేస్తున్నారని విమర్శించారు. ఇలా పెద్దల సభ అన్న గౌరవం కూడా లేకుండా తోటి సభ్యుల మీద చేయి చేసుకోవడం, తోసేయడం చేసేవారిని ప్రజాప్రతినిదులనే అనాలా? అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.
గతంలో కూడా లోక్ సత్తా పార్టీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ పై పలువురు దాడిచేసి ఆయన చొక్కా చించే ప్రయత్నం కూడా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని ఆయన మీడియా పాయింట్లో ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకుడు హరీష్ రావు కారు డ్రైవర్ జేపీపై దాడి చేశారు. దాని మీద కొన్నాళ్లు హడావుడి చేసి, చివరకు తూతూమంత్రంగా వదిలేశారు. సాక్షాత్తు సభ్యులే తోటి సభ్యులపై దాడులు చేసే పరిస్థితి ఉన్నా కూడా దాన్ని అదుపు చేయలేకపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. అసెంబ్లీ రౌడీలా ప్రవర్తిస్తున్న వీరిని రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ అసెంబ్లీకి పంపిస్తారో లేదో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more