అధికార కాంగ్రెస్ పార్టీపై గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చేపడుతున్నకాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టేలా విభజన చేపడుతోందని విమర్శించారు. చత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ ఈరోజు తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ చేపడుతున్న విధానాలు సరిగా లేవన్నారు. గత ఎన్డీఏ పాలనలో చత్తీస్ గఢ్ ఏర్పాటులో ఎటువంటి హింస చోటు చేసుకోకుండా ఏర్పాటు చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తనను టార్గెట్ చేయడం తప్ప మరో పని కన్పించడం లేదని ఆయన తెలిపారు.
అటల్ బిహారీ వాజ్ వాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సామరస్యంగా విభజించిదని ఆయన తెలిపారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టేలా రాష్ట్ర విభజన చేపడుతుందన్నారు. బంధుప్రీతి, అవినీతి,దుష్పరిపాలనలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉందని మోడీ ఎద్దేవా చేశారు. బీమారు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటిగా ఉండేదని, ఛత్తీస్గఢ్ విభజన తర్వాత మధ్యప్రదేశ్ను చూసి కాంగ్రెస్ తెల్సుకోవాలన్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ను ఎవరైనా బీమారు రాష్ట్రమంటారా? అని ఆయన నిలదీశారు. ఒకవేళ విభజన చేస్తే చత్తీస్ గఢ్ లా చేయలని కాంగ్రెస్ కు సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి ఓ ప్రతిపక్ష నేత వేసిన టీకొట్టు డైలాగ్ కూడా కలిసి వచ్చేలా ఉంది. అప్పట్లో టీకొట్టు నడిపినా.. సప్లై చేసినా.. ప్రస్తుతం ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఓ పార్టీ తరపున ప్రధాని అభ్యర్ధి కూడానూ.
అలాంటి వ్యక్తిని టీకొట్టు వ్యక్తి ప్రధాని కాలేడని.. దానికి సమాజం ఒప్పుకోదని రెండు రోజుల క్రితం ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అదే అంశం మోడీజీకి కలిసివచ్చింది.నరేష్ అగర్వాల్ అన్న మాటలకు దేశ వ్యాప్తంగా ఉన్న టీకొట్టు శ్రామికులు ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు. తమని తక్కువ చేసి మాట్లాడే విధంగా వ్యాఖ్యలు చేసిన నరేష్ క్షమాపణ చెప్పాలని కోరారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా చత్తీస్ గఢ్ ర్యాలీలో పాలోన్న మోడీ కూడా నరేష్ వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం చెప్పారు. దేశాన్ని అమ్ముకునే వ్యక్తులు ప్రధాని కావడం కంటే టీని అమ్ముకునేవారు ప్రధాని కావడమే నయమని చురకలంటించారు. అంతేకాదు టీ అమ్మేవాడు ప్రధాని అవుతాడా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని.. రేపు నిరూపించి చూపిస్తారని మోడీ ప్రజలను ఉద్దేశించి ఉద్రేకంగా చెప్పారు.
ఇక పనిలో పనిగా కాంగ్రెస్ నేతలకు కూడా చురకలంటించారు. కాంగ్రెస్ నేతలు టీవీల ముందు కూర్చుని మోడీ ఏం చేస్తున్నాడు.. ఏం చెబుతున్నాడంటూ చూస్తొందని ఓ కామెంట్ విసిరారు. ఇలా మొత్తానికి నరేష్ చేసిన టీకొట్టు కామెంట్ కూడా ఆయనకు సానుభూతిగా మారడంతో కాంగ్రెస్.. ఎస్పీ నేతలు ఏం చేయాలో అయోమయంలో పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more