సచిన్ చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఆయనను వందల కోట్ల కళ్లు వెంటాడుతున్నాయి. క్రీడా ప్రపంచమే కాదు క్రికెట్ ఆడని దేశాల్లో సైతం ఆయన చివరి మ్యాచ్ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. క్రికెట్ దేవుడి 24 ఏళ్లు సుదీర్ఘ క్రికెట్ ఇన్నింగ్స్ కు నేటితో తెరపడనుంది. వెస్డండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్తో ఆయన గ్రౌండ్కు దూరం కానున్నారు. వందల కోట్ల మందిని ప్రభావితం చేసిన దిగ్గజం క్రికెట్ అభిమానులకు దూరం కానున్నాడు.
సచిన్ టెండుల్కర్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతుంటే దేశంమంతా మూగబోయింది. అంతర్జాతీయ మీడియా సైతం క్రికెట్కు సచిన్ వీడ్కోలు చెబుతున్న రోజును మహాత్మాగాంధీ మరణంతో పోల్చింది. ఆయనకు క్రీడా ప్రపంచం వీడ్కోలు పలుకుతున్న తీరును జాతీయ అంతర్జాతీయ మీడియా కళ్లకు కడుతోంది. క్రికెట్ దేవుడిని విదేశీ మీడియా సైతం ఆకాశానికెత్తుతోంది. మహాత్మాగాంధీ మరణం ఎలాంటిదో... సచిన్ క్రికెట్కు వీడ్కోలు పలకడం కూడా అంతేనని అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక వ్యాసాన్ని రాసింది.
సమకాలీన భారతదేశంలో మహాత్మ గాంధీ తరహాలో ప్రభావితం చేసిన వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని కొనియాడింది. గాంధీ మరణంతో దేశం ఎలా మూగబోయిందో సచిన్ రిటైర్మెంట్ను దాదాపు అంతే సైలెంట్గా ఉండి ప్రపంచమంతా గమనిస్తోందని రాసింది. దేశ ప్రజలు గాంధీకి ఎంతగా దాసోహమయ్యారో అదేస్థాయిలో సచిన్ను ప్రేమిస్తారంటోంది.
16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ 40ఏళ్ల వరకూ ఆడుతూనే ఉన్నాడు. ఇన్నేళ్లుగా ఆయన జీవితంలో ఎక్కువ భాగం క్రికెట్కే కేటాయించడాన్ని ఈ కథనంలో పేర్కొంది. రెండు దశాబ్ధాలు తిరుగులేని స్టార్ బ్యాట్స్ మెన్గా గుర్తింపు పొందిన సచిన్ 25ఏళ్ల కెరీర్లో ఎవరూ విమర్శంచలేని విధంగా వ్యవహరించాడని తెలిపింది.
వందల కోట్ల మందిని ప్రభావితం చేసిన ఓ వ్యక్తి ఆట చివరి దశకు చేరుకుంది. 'ఫేర్వెల్ టూ క్రికెట్స్ లిటిల్ మాస్టర్' అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. క్రికెట్ ఆశ శ్వాసగా, మాటతీరు, వ్యవహరశైలి, ఆట పట్ల విధేయతతో ప్రపంచాన్ని గెలుచుకున్నాడని కొనియాడింది. ప్రపంచ క్రికెట్లో సచిన్ ఎప్పటికీ గొప్ప సూపర్ స్టార్.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more