కోల్ కత్తా ఈడెన్ గార్డెన్ లో వెస్టిండీస్ తో జరగుతున్న తొలి టెస్టు లో భారత్ విండీస్ పై ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే భారత బౌలర్లు విండీస్ ఆటగాళ్ళ నడ్డి విరిచి భారీ విజయాన్ని అందించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 324 పరుగులు చేసి ఆలౌట్ అవ్వగా, తొలి ఇన్నింగ్స్ భారత్ 453 పరుగులు చేసింది.
భారత బ్యాట్స్ మెన్స్ లో రోహిత్ శర్మ 177 పరుగులతో, అశ్విన్ 124 పరుగులతో రాణించి భారత్ కి గౌరవ ప్రదమైన స్కోరును అందించడంతో 219 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ సొంత మైదానంలో టెస్టు అరంగ్రేటం చేసిన షమీ ధాటికి 168 పరుగులకే కుప్పకూలి ఇన్నింగ్ 51 పరుగల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. షమీ రెండో ఇన్నింగ్స్ లో 13.1 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు.
ఈ టెస్టుల్లో షమీ మొత్తం 118 పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ ఇలా ముగ్గురు ఏక ధాటిగా దాడి చేయడంతో వెస్టిండీస్ ఏ దశలో కోలుకోలేక పోయింది. మొదటి ఇన్నింగ్స్ లో రెండో రోజు 354 పరుగులు చేసిన ధోని సేన మూడో రోజు మరో 99 పరుగులు జోడించి 453 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న సెంచరీతో చెలరేగిపోయిన రోహిత్ శర్మ నేడు మరిన్ని పరుగులు జోడించి 177 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ఇక నిన్న సెంచరీకి చేరువైన బౌలర్ అశ్విన్ 159 బంతుల్లో 11 ఫోర్లతో 124 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఆ తరువాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. విండీస్ బౌలర్లలో షిల్లాంగ్ ఫోర్డ్ 6 వికెట్లు నేలకూల్చాడు. పెరుమాల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. బెస్ట్, కొట్రీల్ చెరో వికెట్ తీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more